వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.


కడప జిల్లా పులివెందుల సమీపంలో బుధవారం భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న వాహనాలను డ్రైవరు తప్పించబోతున్న సమయంలో బస్సు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు దాదాపు 30 అడుగుల లోతున్న లోయలో పడింది. కదిరి నుంచి పల్లె వెలుగు బస్సు పులివెందులకు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలోబస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story