
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డికి క్యాన్సర్
ఎక్స్ లో వెల్లడించిన కూతురు కాంతి
ప్రముఖ కాపు రిజర్వేషన్ పోరాట నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని ఆమె కూతరు బార్లపూడి కాంతి ఎక్స్ లో ప్రకటించారు.
‘నా తండ్రి ముద్రగడ పద్మనాభం క్యాన్సర్తో పోరాడుతున్నారు, నా సోదరుడు గిరి ఉద్దేశపూర్వకంగా అతనికి అత్యవసరంగా అవసరమైన సరైన చికిత్సను నిరాకరిస్తున్నాడని నేను తీవ్రంగా ఆందోళన చెందుతున్నాను,’ అని ఆమె ఎక్స్ లో ఆందోళనవ్యక్తం చేశారు.
"ఇటీవల, మాజీ YSRCP MLA ఒకరు నన్ను నా తండ్రిని చూడటానికి మంచి ఉద్దేశంతో తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. కానీ గిరి మరియు అతని మామగారు నా తండ్రిని కలవడానికి అనుమతించలేదు. నా తండ్రి ఆరోగ్యం గురించి ఎటువంటి నవీకరణలు లేవు, దగ్గరి బంధువులకు లేదా అతని దీర్ఘకాల అనుచరులకు కూడా కాదు. గిరి మరియు అతని అత్తమామల సన్నిహితులు ఆయనను నిర్బంధించి ఒంటరిగా ఉంచుతున్నారని మరియు ఎవరూ అతనిని సంప్రదించడానికి లేదా మాట్లాడటానికి అనుమతించబడటం లేదని నేను తెలుసుకున్నాను. గిరి, ఇది కేవలం అమానుషం కాదు - ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. మీరు రాజకీయ కారణాల వల్ల ఇలా చేస్తుంటే, నేను ఖచ్చితంగా స్పష్టంగా చెప్పాలి: నేను నిన్ను వదిలిపెట్టను. మా నాన్న గౌరవం, పారదర్శకత మరియు సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణకు అర్హుడు. క్రాంతి."
అని ఆమె పేర్కొన్నారు.
My father, Mudragada Padmanabham, is battling cancer, and I am deeply concerned that my brother Giri is deliberately denying him the proper treatment he urgently needs.
— Kranthi Barlapudi (@kr_barlapudi) June 6, 2025
Recently, a former YSRCP MLA tried to take me to visit my father in good faith. But Giri and his father-in-law…
వైకాపా నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలుగు రాజకీయాల్లో విశిష్టమయిన నాయకుడు. కాపులను రాజకీయ శక్తిగా మార్చేందుకు చాలా ప్రయత్నించారు. ఆయన ఆశయం నెరవేరలేదు. కాపులెవరూ ఆయన బలమయిన కులంగా మారలేదు గాని, ఆయన మాత్రం రెడ్డి అయిపోయారు.
ఒకపుడు ఆయన పట్టిందంతా బంగారమే. తర్వాత ఆయన చెప్పిందేదీ నిజం కాలేదు. ఆయన అంచనాలు తారుమారయ్యాయి. రాజకీయ పరాభవంతో ఆయన తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత మార్చుకున్నారు. పట్టుబట్టి గెజిట్ కూడా తెప్పించుకున్నారు. ఒక వెలుగు వెలిగినా, చివరకు బాగా అభాసు పాలయిన నిజాయితీ పరుడాయన.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోతారని ఆయన పందెం కాశారు. ఒకవేళ అలా జరగకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డి గా మార్చుకుంటానంటూ శపథం చేశారు. అయితే, ఆయన అంచనా తలకిందులైంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో శాసనసభకు ఎన్నిక అయ్యారు. టిడిపి-జనసేన-బిజెపిల కూటమి అధికారంలోకి వచ్చింది. మంత్రిగా ఉపముఖ్యమంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ముద్రగడ రాజకీయ రాజకీయాలనుంచి మాయమయ్యారు. మూడు రోజులు కిందట తుని రైలు దహనం కేసును తిరుగదోడేందుకు టిడిపి ప్రభుత్వం ఒక జివొవిడుల చేసినపుడు ఆయన పేరు వినిపించింది. అయితే, జీవోను ఉపసంహరించుకున్నారు. ఇపుడు ఇలా క్యాన్సర్ ఆయన వార్త అయ్యారు.