![పిఠాపురం పాలిటిక్స్లోకి ముద్రగడ ఎంట్రీ పిఠాపురం పాలిటిక్స్లోకి ముద్రగడ ఎంట్రీ](https://telangana.thefederal.com/h-upload/2024/03/23/436457-mudragada.gif)
పిఠాపురం పాలిటిక్స్లోకి ముద్రగడ ఎంట్రీ
పిఠాపురం పాలిటిక్స్లోకి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఎంట్రీ ఇచ్చారు. వైసీపీ తరపున ప్రచారం ఎలా చేయాలన్న అంశాలపై నేతలకు కీలక సూచనలు చేశారు.
జనసేనాని పవన్ కల్యాణ్, వంగా గీత.. పిఠాపురం సీటు కోసం తలపడనున్నారు. ఇద్దరూ కాపు నేతలే కావడంతో ఆంధ్ర ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం కీలకంగా మారింది. అయితే తాజాగా అక్కడి పాలిటిక్స్లోకి మరో కాపు నేత, కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం ఎంట్రీ ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలుపు ఖరారు చేసేలా ప్రచార వ్యూహాలను రచించడంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈరోజు యూ కొత్తపల్లి మండలం కాపు నేతలతో సమావేశమయ్యారు. కీర్లంపూడిలోని తన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల్లో తమ ప్రచారా శైలి ఎలా ఉండాలన్న అంశంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగానే సభలు, సమావేశాలు ఎలా జరగాలి, ప్రచారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్న అంశాలపై నేతలకు సూచనలు ఇచ్చారు. అనంతరం గ్రామ స్థాయి సభలు కూడా నిర్వహించాలని, అందులో వైసీపీ అందిస్తున్న పథకాలను వివరించాలని చెప్పారు.