రాజకీయాల్లో నారా బ్రాహ్మణి? వస్తారా, రారా?
x

రాజకీయాల్లో నారా బ్రాహ్మణి? వస్తారా, రారా?

నారా బ్రాహ్మణి రాజకీయాల్లో పెద్దగా కనిపించడానికి ఇష్టపడరు. ఆమె ఎంతసేపూ హెరిటేజ్ సంస్థ వ్యాపార కార్యకలాపాలను చూసుకునేందుకే ఇష్టపడతారు. కానీ..


టీడీపీలో చంద్రబాబు అన్నీ తానయి ఉన్న వేళ ఆయనకు సాయంగా నారా లోకేష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అలా తండ్రీ కొడుకులకే పరిమితం అయిన టీడీపీ రాజకీయం బాబు అరెస్ట్ తో కీలక మలుపు తిరిగింది. బాబు అరెస్ట్ అయి 52 రోజులు జైలులో ఉన్నారు. ఆ సమయంలో నారా బ్రాహ్మణి జనంలోకి వచ్చారు. అప్పట్లో కొవ్వొత్తుల ర్యాలీతో పాటు అనేక రకాలైన కార్యక్రమాలలో బ్రాహ్మణి చురుకుగా పాల్గొన్నారు. ఎపుడైతే బాబు జైలు నుంచి

బయటకు వచ్చారో బ్రాహ్మణి తిరిగి తన వ్యాపార కార్యక్రమాలలో నిమగ్నం అయిపోయారు. అలాంటి బ్రాహ్మణి సడెన్ గా మంగళగిరి తెర మీద కనిపించారు. ఆమె అక్కడికెందుకు వెళ్లారనే అంశంపై రకరకాల ఊహగానాలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి తిరిగి లోకేష్ మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

భర్తకు మద్ధతుగా.,

ఈసారి ఆరునూరయినా గెలిచి తీరుతానని లోకేష్ , టీడీపీ కార్యకర్తలు పట్టుదలగా ఉన్నారు. లోకేష్ రాష్ట్రమంతా ప్రచారం చేయాల్సి ఉండడంతో, భర్తకు మద్ధతుగా బ్రాహ్మణి మంగళగిరిలోకి అడుగుపెట్టారని తెలుస్తోంది. బ్రాహ్మణి తాజాగా మంగళగిరిలోని స్త్రీ శక్తి కేంద్రంలోకి అడుగుపెట్టారు. అక్కడ మహిళా లబ్దిదారులతో ఆమె మాటామంతీ నిర్వహించారు. టీడీపీ హయాంలోనే మహిళలకు స్వయం ఉపాధి లభించిందని, తన భర్త మాజీ మంత్రి లోకేష్ పేద మహిళల ఉన్నతి కోసం నిరంతరం పాటుపడుతూ ఉంటారని చెప్పుకొచ్చారు.

మహిళలు సొంతంగా తమ కాళ్ల మీద తాము నిలబడాలన్నది లోకేష్ ఆలోచనగా ఆమె చెప్పడం విశేషం. మంగళగిరిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని అజెండా లోకేష్ పెట్టుకున్నారని. అందుకోసం 27 పథకాలకు రూపకల్పన చేస్తున్నారని బ్రాహ్మణి వివరించారు. రాబోయే రెండు నెలల తరువాత మంగళగిరి రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని కూడా ఆమె హామీ ఇచ్చారు.

2019లో కూడా ప్రచారం

ఇదిలా ఉంటే 2019లో కూడా లోకేష్ కోసం బ్రాహ్మణి విస్తృతంగా తిరిగి ప్రచారం చేశాడు. ఈసారి కూడా ఆమె పెద్ద ఎత్తున మంగళగిరిలో ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే బ్రాహ్మణి ప్రచారం కేవలం మంగళగిరికే పరిమితం అవుతుందా లేక ఏపీ అంతా సాగుతుందా అన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే టీడీపీకి ఈసారి ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా ఉన్నాయి. ఈసారి కనుక ఓడిపోతే టీడీపీ దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవడం ఖాయం. అందుకే ఇప్పటికే నారా భువనేశ్వరి జనంలో ఉంటున్నారు. ఆమె అనేక చోట్ల పర్యటిస్తూ, టీడీపీకి మహిళా మణులను దగ్గరకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు.

మరో వైపు చంద్రబాబు, లోకేష్ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు ఇపుడు నారా బ్రాహ్మణి కూడా మంగళగిరిలో అడుగుపెట్టారు. రానున్న రోజులలో ఆమె రాజకీయం ఏ మలుపు తీసుకుంటుంది అన్నది ఆసక్తిగా ఉంది. ఆమె తండ్రి సినీ నటుడు బాలయ్య కూడా హిందూపురం నుంచి మూడవసారి పోటీ చేయబోతున్నారు. అలాగే ఏపీలో కీలకమైన నియోజకవర్గాలలో బ్రాహ్మణి టూర్ ఉంటుందని అంటున్నారు. మొత్తానికి మొత్తం నారా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ కూడా ఈసారి ఎన్నికల కోసం జనంలోకి వస్తారు అని అంటున్నారు.

Read More
Next Story