తిరుమల అన్నదానం కోసం రూ.38 లక్షల విరాళం...
x
Source: Twitter

తిరుమల అన్నదానం కోసం రూ.38 లక్షల విరాళం...

నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా నారా వారి కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదానం కోసం భారీ విరాళం ఇచ్చారు.


తిరుమల శ్రీవారికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భారీ విరాళం ఇచ్చారు. కుమారుడు నారా దేవాన్ష్ 10వ పుట్టిన రోజు సందర్భంగా లోకేశ్, నారా బ్రాహ్మణి దంపతులు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరితో పాటు నారా భువనేశ్వరి కూడా శ్రీవారి సేవలో పాలుపంచుకున్నారు. దర్శనం ముగించుకున్న తర్వాత మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో లోకేశ్, బ్రహ్మణి కుటుంబ సభ్యులు భక్తులకు అల్పాహారం వడ్డించారు. నారా కుటుంబీకులకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు.

అనంతరం ఒక్కరోజు అన్న వితరణకు అయ్యే ఖర్చు రూ.38 లక్షలను నారా లోకేశ్.. టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు విరాళంగా అందించారు. అయితే ప్రతి ఏడాది కూడా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా నారా కుటుంబీకులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడ ఒక్కరోజు అన్నదానానికి అయ్యే ఖర్చును విరాళంగా ఇస్తుంటారు. ఈ ఏడాది కూడా వారు అదే ఆనవాయితీని కొనసాగించారు.
Read More
Next Story