కర్నూలు బస్ ప్రమాదంలో నెల్లూరు ఇంజినీర్ కుటుంబం బలి
x
బస్ దగ్ధమై మరణించిన వారిలో రమేష్, ఆయన కుటుంబ సభ్యులు

కర్నూలు బస్ ప్రమాదంలో నెల్లూరు ఇంజినీర్ కుటుంబం బలి

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం కావడం వీరు చనిపోయారు


కర్నూలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం సుమారు 20 మంది సజీవదహనం అయ్యారు. మరో 12 మందికి గాయాలయ్యాయి.


హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఉలిందకొండ సమీపంలో బైకును ఢీకొనడంతో మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో మొత్తం 44 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 12 మంది కిందకు దూకి ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో మరణించిన వారిలో నెల్లూరు కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రమేష్ కుటుంబం ఉంది. రమేష్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు సమాచారం అందింది. రమేష్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గొల్ల రమేష్ ది వింజమూరు మండలం గొల్లవారిపాలెం గ్రామం.

Read More
Next Story