పవన్ కల్యాణ్‌ తెనాలి పర్యటన ఎందుకు రద్దయిందంటే...
x
Source: Twitter

పవన్ కల్యాణ్‌ తెనాలి పర్యటన ఎందుకు రద్దయిందంటే...

జనసేనానని పవన్ కల్యాణ్‌కు అస్వస్థతతో తెనాలి పర్యటన రద్దయింది. మళ్ళీ ఎప్పుడు అనేది త్వరలో ప్రకటిస్తారు.


జనసేనాని పవన్ కల్యాణ్ వరుస ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఈరోజు తెనాలిలో పర్యటించడానికి సిద్ధమయ్యారు. కానీ ఇంతలో పవన్‌ అస్వస్థతకు గురికావడంతో తెనాలి పర్యటనను రద్దు చేసుకున్నారు. బుధవారం సాయంత్రం తెనాలిలో నిర్వహించనున్న ర్యాలీ, సభలో పవన్ ప్రసంగించాల్సి ఉంది. ఇంతలో ఆయనకు తీవ్రమైన జ్వరం రావడంతో పవన్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సుమారు 20 కిలోమీటర్లు పాదయాత్ర చేయడంతో ఎండ తీవ్రత కారణంగా అస్వస్థకు గురయ్యారని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుట పడిందని, ఒకటి రెండు రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారని పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే పవన్.. తెనాలిలో పర్యటిస్తారని, ఆ కొత్త పర్యటన తేదీ, షెడ్యూల్‌ వీలైనంత త్వరగా ప్రకటిస్తామని పార్టీ వెల్లడించింది.

బిజీబిజీగా పవన్
ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ ఫుల్ బిజీ అయిపోయారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురంతో పాటు తన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ర్యాలీలు, సభలు నిర్వహిస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా తెనాలి లో పర్యటించాల్సి ఉంది.



Read More
Next Story