డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పటి ఏ మంత్రి వర్గ సమావేశానికి పవన్‌ కల్యాణ్‌ డుమ్మా కొట్టలేదు.


ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్‌ కల్యాణ్‌ ఇంత వరకు ఏ మంత్రి వర్గ సమావేశం ఎగ్గొట్ట లేదు. క్రమం తప్పకుండా ప్రతి కేబినెట్‌కు హాజరయ్యారు. రాజకీయాలకు అలవాడు పడినా.. పాలన రంగానికి కొత్త కావడంతో ఏదో నేర్చుకోవాలనే తపనతో ప్రతీ సమావేశానికి హాజరవుతూ వచ్చారు. తన శాఖలలో అధికారులతో జరిగే అంతర్గత సమీక్ష సమావేశాలను కూడా ఓపికతో పాల్గొంటూ, తన శాఖలపై పట్టు సాధించేందుకు ప్రయత్నించేవారు. నాడు చదువు లేక పోవడం, ఇంటర్‌తోనే తన చదువును ఆపేయడం, దాని ద్వారా వచ్చే ఇబ్బందులు ఇప్పుడు తెలుస్తున్నాయని, చవుదువు ప్రాముఖ్యత, బాగా చదవుకొని ఉండి ఉంటే సులువుగా సబ్జెక్టును అర్థం చేసుకోవడానికి వీలుండేదని మంత్రి పదవి చేపట్టిన తొలి నాళ్లల్లో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. అప్పట్లో ఇవి సంచలనంగా మారాయి. తన చదువు గురించి చెప్పి తన నిజాయితీని చాటుకున్నారని టాక్ వచ్చింది.

ప్రజల పట్ల బాధ్యతను, ప్రజల పట్ల నమ్మకాన్ని ప్రజల పట్ల తన డ్యూటీని, ప్రజల పట్ల తన అంకిత భావాన్ని చూపించుకోవడానికి తాపత్రయపడే ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మరో సారి ఆ ప్రయత్నం చేశారు. తాను గురువారం కేబినెట్‌ సమావేశానికి హాజరు కాలేనంటూ.. దానికి గల కారణాలు వెల్లడించి తన నిజాయితీని మరో సారి ప్రజల ముందు ఉంచారు. తాను గురువారం జరిగే కేబినెట్‌ సమావేశానికి తాను హాజరు కాలేక పోతున్నానని ముందుగానే వెల్లడించారు. తాను వైరల్‌ ఫీవర్‌తో ఇబ్బంది పడుతున్నట్లు తెలియజేశారు. జ్వరంతో పాటు స్పాండిలైటిస్‌ కూడా తనను ఇబ్బంది పెడుతున్నట్లు పేర్కొన్నారు. వైద్యుల సూచనల మేరకు తాను విశ్రాంతి తీసుకుంటున్నాని, ఈ కారణాలతో తాను గురువారం జరిగే కేబినెట్‌ సమావేశానికి హాజరు కాలేనని పవన్‌ కల్యాణ్‌ పేర్కొంటూ.. సీఎం చంద్రబాబు పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు.
Next Story