Central University | అనంతపురం: రక్షణ కల్పించాలటున్న విద్యార్థినులు
x
అనంతపురంలో ధర్నా చేస్తున్న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థినులు

Central University | అనంతపురం: రక్షణ కల్పించాలటున్న విద్యార్థినులు

రక్షణ కల్పించాలని సెంట్రల్ వర్సిటీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. విసీతో పాటు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.


అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థినుల ఆందోళనతో సోమవారం మధ్యాహ్నం అట్టుడికింది. యూనివర్సిటీలో రక్షణ కల్పించడానికి అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీలో తమకు రక్షణ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. హాస్టల్ ఆవరణలోకి ఆగంతకులు వస్తున్న, నివారించే దిక్కులేదు. ఈ పరిస్థితుల్లో మాకు రక్షణ లేకుండా పోయిందని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ సంఘటనపై అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ కూడా స్పందించారు. యూనివర్సిటీకి వెళ్ళిన వారు విద్యార్థులతో మాట్లాడారు. సెంట్రల్ యూనివర్సిటీ వీసి ( Central University vice chancellor) ఎస్ ఏ కోరి పై కూడా ఆయన ఆగ్రహ వ్యక్తం చేశారు. ఇక్కడ సమస్యలను మరోసారి కేంద్ర విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.


రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా 2018లో అనంతపురం జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటయింది. సింగనమల నియోజకవర్గం జంతలూరు వద్ద యూనివర్సిటీ ప్రారంభించారు. వర్సిటీలో అకాడమి క్ భవనం తో పాటు హాస్టల్ లో 2100 మంది విద్యార్థులకు బోధనలకు వీలుగా ఏర్పాటు చేశారు. దేశంలోని 21 రాష్ట్రాల నుంచి 668 మంది విద్యార్థులు ఎన్రోల్ అయినట్లు సెంట్రల్ వర్సిటీ వెబ్సైట్ స్పష్టం చేస్తుంది. కాగా, ఇక్కడ ఇంకా నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి. భవన నిర్మాణం కోసం బీహార్ ప్రాంతానికి చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. కాగా వారిలో కొందరి నుంచి తరచూ సమస్యలు తలచిత్తుతున్నాయనే విషయాన్ని విద్యార్థులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. తాజాగా

ఆగంతకుల చొరబాటు
అనంతపురం సమీపంలోని సెంట్రల్ యూనివర్సిటీలో ఆదివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి చొ రపడేందుకు ప్రయత్నించినట్లు విద్యార్థినులు ఆరోపించారు. విద్యార్థులు బాత్రూం కి వెళితే గుర్తు తెలియని వ్యక్తులు తొంగి చూస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. వెంటనే "హాస్టల్లో వార్డెన్స్ కు ఈ విషయం చెప్పాం. వర్సిటీ వైస్ ఛాన్స్లర్ కోరి రాకపోగా, కనీసం ఏమి జరిగిందనే విషయాన్ని కూడా వాకబు చేయలేదని విద్యార్థులు ఆరోపించారు. సోమవారం మధ్యాహ్నం ఓ మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పిన అధికారుల నుంచి కనీస స్పందించిన కనిపించలేదు" అని విద్యార్థినులు ఆరోపించారు.
పరిపాలన భవనం వద్ద ఆందోళన
సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్, పోలీసు అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు అని ఆగ్రహిస్తూ, సెంట్రల్ వర్సిటీ పరిపాలన భవనం వద్ద సోమవారం మధ్యాహ్నం నుంచి విద్యార్థులు భారీ సంఖ్యలో ఆందోళనకు దిగారు. ఈ సంఘటనపై పలువురు విద్యార్థులు మాట్లాడుతూ,
సెంట్రల్ యూనివర్సిటీలోని విద్యార్థుల హాస్టల్ వద్ద రక్షణ చర్యలు ఏమాత్రం లేవని ఆరోపించారు. "ఇక్కడ ఎలాంటి దుశ్చర్యలు జరిగిన అడ్డుకునే స్థితి లేదు. సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదు. విద్యుత్ సరఫరా లోపం ఉందని చెబుతున్నారు" అని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఆస్తుల ప్రహరీ దాటి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశిస్తున్నట్లు విద్యార్థులు ఆరోపించారు.
ఇది రెండోసారి...
సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల హాస్టల్ లోకి గుర్తు తెలియని వ్యక్తులు రావడం ఇది రెండవసారి అని చెప్పారు. గత ఏడాది డిసెంబర్ 9వ తేదీన " బీహార్ ప్రాంతానికి చెందిన విద్యార్థిని కూడా తీవ్ర ఇబ్బంది పడింది. వాష్ రూమ్ కు వెళ్లిన సమయంలో ఆగంతకులు తొంగి చూడడం గమనించింది. ఇదే విషయంపై పోలీసులకు ఆ విద్యార్థితో పాటు మేము ఫిర్యాదు చేసాం" అని గుర్తు చేశారు. ఈ సంఘటనపై పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
"హాస్టల్ లోకి ప్రవేశించిన వ్యక్తి ఎవరనేది ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నాం" అని చెప్పడం మినహా అరెస్టు చేసిన దాఖలాలు లేవని విద్యార్థులు ఆరోపించారు.
తాజాగా, ఆదివారం రాత్రి ఓ విద్యార్థిని బాత్ రూమ్ కి వెళ్ళింది. గుర్తు తెలియని వ్యక్తి నీడ కనిపించింది. గట్టిగా కేకలు వేయడంతో పారిపోయాడు. గోడ దూకిన శబ్దం స్పష్టంగా వినిపించినట్లు బాధిత విద్యార్థిని చెప్పడంతో అందరం వెళ్లి హాస్టల్ ఇన్చార్జిలకు ఫిర్యాదు చేశామని చెప్పారు.
స్పందించని వీసి
సంఘటన జరిగిన వెంటనే హాస్టల్ ఇన్చార్జిల ద్వారా సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ కోరి కి సమాచారం అందించిన స్పందన లేదని విద్యార్థులు చెప్పారు. దీంతో ఆదివారం అర్ధరాత్రి వరకు విద్యార్థినులు ఆందోళనలకు దిగారు. సోమవారం మధ్యాహ్నం వర్సిటీ అధికారులు, పోలీసు అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన, ఇప్పటివరకు స్పందన లేదని విద్యార్థులు ఆరోపించారు.
ఫీజులు చెల్లిస్తున్నాం..
మిగతా విద్యాసంస్థలతో పోలిస్తే అనంతపురం లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఫీజులు చెల్లించే చదువుకుంటున్నామని విద్యార్థులు గుర్తు చేశారు. "యూనివర్సిటీలో మెయింటెనెన్స్ చార్జింగ్ కూడా మేమే చెల్లిస్తున్నాం. వసతులు మాత్రం కల్పించడం లేదు. మేము చెల్లించే ఫీజు డబ్బులు ఏమవుతున్నాయి"? అని నిలదీశారు. హాస్టల్ ల వద్ద సెక్యూరిటీ సక్కగా లేదు. సీసీ కెమెరాలు ఉన్న నామమాత్రంగా మారాయి. "పవర్ కట్ ఉందంటూ అవి పని చేస్తున్నాయా లేవా అనేది కూడా పట్టించుకోవడం లేదు" అని విద్యార్థినులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులనే పద్యంలో మాకు సెంట్రల్ యూనివర్సిటీ రక్షణ లేకుండా పోయింది. అని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న ఘటనలపై విచారణ జరపించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇక్కడ తమకు రక్షణ కల్పించడానికి సీఎం ఎన్ చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అందించాలని కోరుతున్నారు.
రక్షణ కల్పించండి...
సెంట్రల్ వర్సిటీలో విద్యార్థినులకు రక్షణ కల్పించాలని అనంతపురం జిల్లాకు చెందిన న్యాయవాది ఎం. ఖమర్ బేగం డిమండ్ చేశారు. ఇక్కడ కూడా రక్షణ లేకపోవడం దారుణమన్నారు. రెండు రోజులుగా నిరసనలు సాగుతున్నా, స్పందించకపోవడం దారుణమని ఆమె నిరసన వ్యక్తం చేశారు.

విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులు తెలుసుకోవడానికి సంఘాల నాయకులు కాదు కదా. మీడియాను కూడా అనుమతించడం లేదు. సెంట్రల్ యూనివర్సిటీలో పూర్తిస్థాయిలో వసతులు కూడా అందుబాటులో లేవు అని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుళాయి స్వామి చెప్పారు. "వర్సిటీ ఆవరణలో ఇంకా భవన నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి. ఇక్కడ పనిచేయడానికి బీహార్ ప్రాంతానికి వచ్చిన కూలీలు ఉన్నారు. వీరిలో కొందరి వల్లే కొన్ని సమస్యలు ఎదురవుతున్నట్టు తమ దృష్టికి కూడా వచ్చింది" అని కుళాయి స్వామి చెప్పారు.

వర్సిటీని సందర్శించిన ఎంపీ, ఎమ్మెల్యే

సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న వ్యవహారాలు తెలుసుకున్న అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ఆ ప్రాంతానికి వెళ్లారు. ఇక్కడ జరుగుతున్న సంఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులతో పాటు, వర్సిటీలోని అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ విద్యార్థులకు హామీ ఇచ్చారు. శింగనమల శాసనసభ్యులు బండారు శ్రావణి గారితో కలిసి సోమవారం ఆయన వర్సిటీని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

విద్యార్థులతో సమస్యలు అడిగి తెలుసుకున్న ఆయన ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదంటూ వసతి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ఘటన నేపథ్యంలో ఏపీ గవర్నర్ తో పాటు, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు కూడా లేఖ రాశానని చెప్పారు. మరోసారి ఈ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకో వెళ్లడం ద్వారా పరిస్థితి చక్కదిద్దడానికి చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. బాధ్యతారహితంగా వ్యవహరించిన పోలీస్ అధికారులపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు భద్రత కల్పించడంతోపాటు నిఘా ఏర్పాటు చేయడానికి నాణ్యమైన భోజనం వడ్డించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన అధికారులు ఆదేశించారు.

Read More
Next Story