జర్నలిస్ట్‌ కొమ్మినేనికి సుప్రీం కోర్టులో ఊరట
x

జర్నలిస్ట్‌ కొమ్మినేనికి సుప్రీం కోర్టులో ఊరట

ఇక ముందు అభ్యంతరకర వ్యాఖ్యాలు చేయరాదని, అనుమతించరాదని కోర్టు కొమ్మినేనిని ఆదేశించింది.


అమరావతి వేశ్యల రాజధాని అనే వాఖ్య విషయంలో అరెస్టు అయిన సాక్షి చానెల్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు (కెఎస్ఆర్) కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.

శ్రీనివాసరావు హోస్ట్ చేసిన టెలివిజన్ షోలో ప్యానెలిస్ట్ కృష్ణం రాజు అనే మరొక జర్నలిస్టు చేసిన ఈ వాఖ్య చేశారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు మాడరేటర్ గా ఉన్న కెఎస్ ఆర్ అడ్డుకోలేదని, దీని వల్ల అమరావతి ప్రాంత మనోభావాలు దెబ్బతిన్నాయని పలువురు మహిళలు కేసు పెట్టారు.

దీని మీద ఆయనను జూన్ 9న హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆయన మీద పెట్టి ఎస్ ఎస్ టి కేసు సెక్షన్లు తొలగించి రిమాండ్ పంపింది. ఈ రిమాండ్ ను సవాల్ చేస్తూ శ్రీనివాసరావు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా , జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ముందు శుక్రవారం నాడు విచారణకు వచ్చింది. ఈ బెంచ్ బెయిల్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ వ్యాఖ్యని శ్రీనివాసరావు చేయలేదని మరొక ప్యానెలిస్ట్ చేశాడని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదించారు. "ఈ కేసు నావికా లేదా సర్దేశాయ్ కేసు లాంటిది..." అని జస్టిస్ మిశ్రా వ్యాఖ్యానించారు. మరొకరు చేసిన ప్రకటనలకు పిటిషనర్‌ను ఎలా అరెస్టు చేస్తారని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. "వేరొకరు ఆ ప్రకటన చేశారు. మరొకరిని అరెస్టు చుశారు. ఇది ఎలా సాధ్యం?" అని జస్టిస్ మన్మోహన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గిని ప్రశ్నించారు.

అయితే, చర్చలోకి వచ్చిన అతిథి అభ్యంతరకరమయిన ఈ వ్యాఖ్య చేస్తున్నపుడు శ్రీనివాసరావు ఆయన ప్రేరేపిస్తున్నారని, ఆ వ్యాఖ్య చేయకుండా ఆపే ప్రయత్నం చేయలేదని రోహత్గీ కోర్టుకు నివేధించారు.

‘ఎవరైనా అభ్యంతరకరమయిన వ్యాఖ్యలు చేస్తున్నపుడు మనమంతా నవ్వేసి విస్మరిస్తుంటాం. అంతామాత్రాన వాళ్లని సహనేరస్థులుగా పరగణించలేం.ఇది రోజూ జరుగుతున్నదే,’ అని జస్టిస్ మన్మోహన్ వ్యాఖ్యానించారు.దీనికి సమదానమిస్తూ, పిటిషనర్ ని దారినపోయే దానయ్యలాగా చూడలేమని, ఆయన చానెల్ భాగమని రోహత్గీ అన్నారు. అంతేకాదు, పిటిషనర్ మౌనంగా ఉంటూ ఒక అభ్యంతకరమయిన వ్యాఖ్యనిఅనుమతించడం కూడా నేరం కిందికే వస్తుందని రోహత్గీ వాదించారు.

అయినా సరే, ఆ వ్యాఖ్యని శ్రీనివాస రావు చేయలేదన్నవిషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనను విడుదల చేయాలని ఆదేశిసిస్తూ, పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరాన్నిగుర్తించాలని ధర్మాసనం పేర్కొంది.

అయితే, ఎలాంటి అభ్యంతరకమయిన తాను స్వయాన చేయడం కాని, యాంకర్ మరొక రు చేస్తున్నపుడు అనుమతించడం గాని చేయరాదని ధర్మాసనం పిటిషనర్ ను ఆదేశించింది.

Read More
Next Story