మరింత దారుణమైన సంఘటన ఏమిటి అంటే ఈ కేసులో నికిత సంఘానియా తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. తన తండ్రి మరణానికి కూడా మాజీ భర్త అతుల్ కారణమని మరో కేసు పెట్టింది. ఈ కేసు సెటిల్మెంట్ చేసుకోవడానికి నిఖిత కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆతులు తన సూసైడ్ నోట్లో ప్రస్తావించాడు. అంటే మొత్తం మీద 498a సెక్షన్ ఉపయోగించుకొని అత్తింటి ఆరళ్లు, వరకట్నం వేధింపులు చేస్తున్నారంటూ ఎన్ని రకాల వీలైతే అన్ని రకాలుగా దుర్వినియోగం చేయడానికి నిఖిత వ్యవహరించిన తీరు ద్వారా స్పష్టమవుతుంది.
సమర్థనీయం కాదు.. అయితే.
భార్యను హింసించడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. ఈ గృహహింస చట్టంలో మహిళలకు మాత్రమే రక్షణ కల్పిస్తున్నాయి. అనేది అనేక కేసులు పరిశీలిస్తే అర్థమవుతుంది. తప్పు చేయకున్నా మగవాళ్ళు మాత్రం చట్టం ముందు దోషిగా నిలబడాల్సిందేనా? చట్టాలను అనుకూలంగా ఉన్నాయని మగవారి స్వేచ్ఛను దుర్వినియోగం చేసే వారికి శిక్షలు ఉండవా అంటే... బెంగళూరు టకీ అతను సుభాష్ ఆత్మహత్యతో సర్వోన్నత న్యాయస్థానం కూడా స్పందించింది.
కరిగిన కలలు
ఏ వ్యక్తి అయినా పెళ్లి చేసుకొని ఆనందంగా దాంపత్య జీవితం గడపాలనే కలలు కంటారు. పిల్లలతో సరదాగా ఉండాలని భావిస్తారు. పెళ్లి, పిల్లలు, దాంపత్య జీవితం అంటూ అందరి మాదిరి కలలుగన్న అతుల్ సుభాష్ జీవితం అర్ధంతరంగా ఆగింది.
బెంగళూరు చెందినట్టకి అతుల్ సుభాష్ కూడా సగటు మనిషే. తాను కన్న కలలన్నీ కలలుగా మారాయి. భార్య వేధింపులు. కేసులు. చివరికి తన తండ్రి మరణానికి కూడా భర్త అతుల్ సుభాష్ కారణమని నికతా సింఘానియా పెట్టిన కేసు కూడా రిజిస్టర్ అయింది. అంతకుముందు అసహజ శృంగారం, కట్నం కోసం వేధించాడనే అనేక కేసులు పెట్టింది. పరిహారంగా కోట్లు డిమాండ్ చేసింది. ఈ కేసుల్లో నిజానిజాలు వాస్తవికతను పరిశీలన చేయకుండానే పోలీసులు కేసులు నమోదు చేయడం గమనించతగిన విషయం.
ఈ వేధింపులు భరించలేని అతుల్ సుభాష్ 24 పేజీల సూసైడ్ నోట్ తో పాటు 45 నిమిషాల నిడివి కలిగిన వీడియోను సుప్రీంకోర్టు జడ్జికి పంపించారు.. ఆపాటికే అతను సుభాష్ అర్ధంతరంగా తన జీవితాన్ని చాలించాడు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించడమే కాదు 498ఏ కేసు పై సమీక్షకు దిగింది. రాష్ట్రాల హైకోర్టులను కూడా అప్రమత్తం చేసింది. ఇంతకీ ఎవరి అసలు సుభాష్, నికిత సింఘానియా ఎందుకు వేధింపులకు పాల్పడింది. ఈ ఎపిసోడ్లో ప్రాణాలు తీసుకున్న అతుల్ సుభాష్ ఆత్మహత్యపై సుప్రీంకోర్టు ఎలా స్పందించింది?
ఎవరి సింఘానియా
బెంగళూరులో ఐటి ఉద్యోగులకు కంపెనీలకు కొదవలేదు. అలాంటి కంపెనీలో అతుల్ సుభాష్ ఓ టెకి. అదే కంపెనీలో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన నికిత సింఘానియాను 2019లో సుభాష్ పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లపాటు వెళ్ళి దాంపత్య జీవితం సాఫీగా సాగింది. వారి ఆనందానికి అనుబంధాన్ని పెంచుతూ సింఘానియా ఏడాదన్నర తర్వాత ఓ బాబుకు జన్మనిచ్చింది. యూపీ (Uttar PRadesh ) ఊరు నుంచి ఏడాదిన్నర తర్వాత 2021లో బాబును ఇంటికి బాబును తీసుకుని వచ్చింది.
అందమైన భార్య. చక్కటి మగబిడ్డ. ఇద్దరిని చూసి సుభాష్ ఎంతో మురిసిపోయారు. తాను కన్న కలలు దేవుడు నిజం చేశాడని సంబరపడిపోయారు. అదే తనకు చివరి ఆనందకరమైన రోజులనే విషయాన్ని సుభాష్ కు తెలియదు. విధిరాత అలా ఉంది. ఎందుకో తెలియదు. ఏమి జరిగిందో?? అతుల్ సుభాష్ తో భార్య నికిత సింఘానియా మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో వారిద్దరూ విడిపోయారు.
అక్కడి నుంచి కష్టాలు ప్రారంభం
భార్య నిఖిత సింఘానియా విడిపోయిన తర్వాత అతను సుభాష్ కు కష్టాలు ప్రారంభమయ్యాయి. కేసులు వెంటాడాయి. భార్య నికిత సింఘానియా కేసులు బనాయించడం ప్రారంభించింది. అందులో..
" అసహజ శృంగారం చేయాలని ఒత్తిడి చేశాడు" అనే కాకుండా, కట్నం కోసం వేధించాడు" అంటూ భర్త అతుల్ సుభాష్ పై నిఖిత సింఘానియా కేసులు పెట్టింది. కోట్ల రూపాయలు పరిహారం డిమాండ్ చేసింది. సాధారణ టెకీగా జీవితం సాగిస్తున్న అతుల్ సుభాష్ ఈ కేసులతో దిమ్మదిరిగిపోయింది. తనకు అంత స్థామత లేదనే విషయాన్ని కూడా స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. "ఫిర్యాదులు అందుకున్న పోలీసులు కూడా, కేసుల్లో ఎంతమేరకు వాస్తవాలు ఉన్నాయనేది శోధించకుండా రిజిస్టర్ చేశారు."
ఏమి చేయాలో పాలుపోక
ఉద్యోగం చేయకుంటే బతకడం కష్టం. తన నుంచి విడిపోయిన భార్య పెట్టిన అనేక కేసులు ఓ పక్క. ఆమె ఏకంగా కోట్లు డిమాండ్ చేస్తోంది. కోర్టులో తన వేదన, నిస్సహాయత తెలియజేస్తున్న చట్టాల్లో ఆ వెసులుబాటు లేదని అతను సుభాష్ గ్రహించినట్లు ఉన్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో మానసికంగా కుంగిపోయిన సుభాష్, తనకు జరిగిన ప్రతి అవమానం, అన్యాయాన్ని కూలంకషంగా వివరిస్తూ 24 పేజీల లేఖ రాశారు. ఇదంతా ఒక ఎతైతే,
న్యాయం జరగాలి (Justice is due) శరీరంపై ఓ స్టికర్ అతికించుకున్నాడు. 1.30 గంటల నిడివి తో ఉన్న ఓ వీడియోను అతుల్ సుభాష్ తన వేదనను వివరించాడు. ఆత్మహత్యకు ముందు తీసుకున్న వీడియో చూస్తే అతుల్ ఎంత నరక యాతన అనుభవించాడనేది తెలుస్తుంది.. ఈ వీడియోతో పాటు ఓ లేఖ కూడా అన్ని రాష్ట్రాల హైకోర్టులు, బంధువులో తోపాటు సుప్రీంకోర్టు కూడా పంపించారు. అవన్నీ దేశ సర్వోత్తమ న్యాయస్థానానికి అందే సరికి అతుల్ సుభాష్ ఈ లోకంలో లేడు. అదే సమయంలో ఈ తరహా కట్నం వేధింపుల కేసును విచారణ చేస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ముందుకు అతుల్ సుభాష్ పంపిన లేఖ, వీడియో చేరింది.
బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజినీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన సుప్రీంకోర్టును కూడా కదిలించింది అనడంలో మాత్రం సందేహం లేదు. సుప్రీం కోర్టు జడ్జీలు స్పందించారు. 498ఏ లో చేయాల్సిన మార్పులపై దృష్టి సారి ఇచ్చినట్లే కనిపిస్తోంది. అంతేకాకుండా, రాష్ట్ర హైకోర్టులకు కూడా వారు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టులతో పాటు 498a ఫిర్యాదుల్లో లోతుపాతులను పరిశీలించకుండా రిజిస్టర్ చేయడంపై కూడా పోలీసులకు తలంటినట్లు కనిపిస్తోంది.
"మహిళలు చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే విషయాన్ని గుర్తు చేసింది" తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి విడాకుల కేసు విచారణ చేస్తున్న సమయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాకుంటే అన్ని కేసులో ఇలా ఉండవు కొన్ని నిజమైన వేధింపుల కేసులు ఉన్నాయని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. బెంగళూరు టెకి అటుల్ సుభాష్ కేసులో తనకు న్యాయం చేయాలని వస్తున్న డిమాండ్ల క్రమంలో సుప్రీంకోర్టు సెక్షన్ 190 ఏ చట్టాన్ని మహిళలు దుర్వినియోగం చేస్తున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది.
బార్ అండ్ బెంచ్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి విడాకుల కేసులు మంగళవారం విచారణ చేపట్టింది ఐపీసీలోని సెక్షన్ 490ఏ చట్టాన్ని మహిళలు, వారి భర్త బంధువులను వేధించేందుకు చేస్తున్నారని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్. కోటేశ్వర్ సింగ్ తో కూడిన ధర్మాసనం 498a చట్టం దుర్వినియోగం పై ఆందోళన వ్యక్తం చేసింది మహిళలు కొంతమంది భర్త అతని కుటుంబాన్ని వేధించేందుకు ఈ సెక్షన్ ఉపయోగిస్తున్నారని వ్యాఖ్యానించింది. భర్త అతని కుటుంబంపై వ్యక్తిగత ప్రతీకార్యాన్ని తీర్చుకునేందుకు మహిళలు ఈ నిబంధనను ఓ సాధనంగా వినియోగించుకుంటున్న ధోరణి ట్రైన్ లా మారింది అని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.
కడపకు చెందిన సీనియర్ అడ్వకేట్ కడప నగరంలోని సీనియర్ న్యాయవాది పఠాన్ అక్గర్ అలీఖాన్ ఏమంటున్నారంటే..
"వరకట్న కేసు వచ్చిందని పోలీసులు పిలగానే భయంతో వెళ్లకూడదు" అని న్యాయవాది పఠాన్ అక్గర్ అలీఖాన్ సూచించారు. సీఐ లేదా ఎస్ఐ చెప్పే వివరాలు ఆలకించండి. ఇందులో వాస్తవాలు ఏమటనేది పోలీస్ అధాకారులను కోరాలి" అని అక్బర్ చెబుతున్నారు. తన భార్య ఇచ్చిన పేర్లలో ఎంతమంది ప్రమేయం ఉందనే విషయాన్ని గట్టిగా అడగగలిగితే, బాధితుడు నిందితుడిగా మారడు. అతని కుటుంబీకులు కూడా వేదనకు గురయ్యే పరిస్థితి ఎదురుకాదు" అని ఆయన అంటున్నారు.
సుభాష్ తండ్రి మాట కూడా "Justice Is Due"