వేద విద్యార్థులకు నిరుద్యోగ భృతి:  టిడిపి హామీ
x

వేద విద్యార్థులకు నిరుద్యోగ భృతి: టిడిపి హామీ

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రత్యేక కృషి ఉంటుందని , ఇందులో నిరుద్యోగ భృతి ఒకటిని లోకేష్ చెప్పారు. వివరాలు



అమరావతి: వేదం అభ్యసించి వేదం ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నవారికి నిరుద్యోగ భృతి అందిస్తామని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ హామీ ఇచ్చారు. ఇలాగే బ్రాహ్మణులని పేదరికం నుండి బయటకు తీసుకురావడానికి ప్రత్యేక కృషి చేస్తామని కూడా ఆయన చెప్పారు.


ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్ర బ్రాహ్మణ సాధికార కమిటీ అధ్యక్షులు బుచ్చిరామ్ ప్రసాద్ అధ్వర్యంలో 50మంది బ్రాహ్మణ ప్రముఖులు యువనేత సమక్షంలో ఈరోజు టిడిపిలో చేరారు. వారందరికీ లోకేష్ పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.


ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ బ్రాహ్మణ ఆడ బిడ్డల పెళ్లి కి ప్రభుత్వం నుండి సహాయం అందిస్తామని బ్రాహ్మణ విద్యార్థుల ఉన్నత విద్యకు సహాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారు. బ్రాహ్మణుల సంక్షేమంలో భాగంగా అర్చకులకు గుర్తింపు కార్డులు, గౌరవ వేతనం, గౌరవం ఇస్తామని కూడా లోకేష్ చెప్పారు.


బ్రాహ్మణుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని చెబుతూ గతంలో టిడిపి ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా 5ఏళ్లలో బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.285 కోట్లు ఖర్చు చేందని చెప్పారు. " గతంలో స్వయం ఉపాధికి నాలుగు లక్షల వరకూ 50 శాతం సబ్సిడీతో రుణాలు ఇచ్చాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే గుడుల నిర్మాణానికి దేవాదాయ శాఖతో సంబంధం లేకుండా స్టేట్ బడ్జెట్ నుండి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తాం. బ్రాహ్మణ కార్పొరేషన్ ని మరింత బలోపేతం చేస్తాం," అని లోకేష్ చెప్పారు.

పార్టీలో చేరిన బ్రాహ్మణ ప్రముఖుల్లో సత్యవాడ దుర్గాప్రసాద్ (టక్ ప్రసాద్) (రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య, ఏలూరు), యామిజాల నరసింహ మూర్తి,( గౌరవ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య, విశ్రాంత డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్, భీమవరం), శ్రీశ్రీ శర్మ ( వైస్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా బ్రాహ్మిన్ ఫెడరేషన్, ఏలూరు), కె. రామరాజు (రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంఘం, కర్నూలు), ఏం బి ఎస్. శర్మ (అఖిల భారత బ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షులు), వై. సాయి సురేష్ (బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్), ఇసుకపల్లి. కామేశ్వర ప్రసాద్ (బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య జనరల్ సెక్రెటరీ), మరో 50 మంది బ్రాహ్మణులు, వివిధ సంఘాల్లో పనిచేసే ముఖ్యులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టిడి.జనార్ధన్, వేమూరి ఆనంద సూర్య, ఈమని. సూర్య నారాయణ, గూడూరి. శేఖర్, సంతోష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
**


Read More
Next Story