34 మంది అభ్యర్థులతో టీడీపీ రెండో జాబితా
x
Source: Twitter

34 మంది అభ్యర్థులతో టీడీపీ రెండో జాబితా

టీడీపీ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను చంద్రబాబు ఈరోజు విడుదల చేశారు. ఇందులో 34 మంది అభ్యర్థులను ప్రకటించారు.



అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అన్ని పార్టీలు తమ అభ్యర్థులను పోటీపోటీగా ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే 94 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన టీడీపీ ఈరోజు తమ రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో టీడీపీ.. 34 మంది అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ-జనసేనతో కుదుర్చుకున్న పొత్తులో భాగంగా టీడీపీ మొత్తం 144 స్థానాల్లో పోటీ చేయనుంది. వీటిలో ఫిబ్రవరి 24న 94 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. రెండో జాబితాను ఈరోజున ప్రకటించింది. కాగా టీడీపీ మరో 16 స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు.



అభ్యర్థుల రెండో జాబితా


టీడీపీ విడుదల చేసిన రెండో జాబితాలో 34 మంది పేర్లను ప్రకటించారు. తమ రెండో జాబితాలో టీడీపీ.. 27 మంది పురుషులకు, ఏడుగురు మహిళలకు అవకాశం కల్పించింది. వీరిలో 25-35 సంవత్సరాల మధ్య వయసు వారు ఇద్దరు, 36-45 వయసు మధ్య వారు ఎనిమిది మంది, 46-60 ఏళ్ల మధ్య వారు 19 మంది, 61-75 సంవత్సరాల మధ్య వయసు వారు ముగ్గురు, 75 ఏళ్లు పైబడిన వారు ఇద్దరు ఉన్నారు.


అభ్యర్థుల విద్యార్హతలు ఇలా


టీడీపీ విడుదల చేసిన రెండో జాబితాలోని అభ్యర్థుల్లో ఒకరు పీహెచ్‌డీ ఉత్తీర్ణులు కాగా 11 మంది పీజీ, తొమ్మిది మంది డిగ్రీ, ఎనిమిది మంది ఇంటర్‌మీడియట్ ఉత్తీర్ణులైన వారు ఉన్నారు. అంతేకాకుండా పదోతరగతి అంతకన్నా తక్కువ విద్యార్హత ఉన్న వారు ఐదుగురు ఉన్నారు.


టీడీపీ రెండో జాబితా ఇదే..


రాజమండ్రి రూరల్‌ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి

రంపచోడవరం - మిర్యాల శిరీష

కొవ్వూరు - ముప్పిడి వెంకటేశ్వరరావు

దెందులూరు - చింతమనేని ప్రభాకర్‌

గోపాలపురం - మద్దిపాటి వెంకటరాజు

పెదకూరపాడు - భాష్యం ప్రవీణ్‌

గుంటూరు వెస్ట్‌ - పిడుగురాళ్ల మాధవి

గుంటూరు ఈస్ట్‌ - మహ్మద్‌ నజీర్‌

నరసన్నపేట - బగ్గు రమణ మూర్తి

కమలాపురం - పుత్తా చైతన్య రెడ్డి

ప్రొద్దుటూరు - వరదరాజుల రెడ్డి

నందికొట్కూరు (ఎస్సీ) - గిత్తా జయసూర్య

గాజువాక - పల్లా శ్రీనివాసరావు

చోడవరం - కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు

మాడుగుల - పైలా ప్రసాద్‌

ప్రత్తిపాడు - వరుపుల సత్యప్రభ

రామచంద్రాపురం - వాసంశెట్టి సుభాష్‌

గురజాల - యరపతినేని శ్రీనివాసరావు

కందుకూరు - ఇంటూరి నాగేశ్వరరావు

మార్కాపురం - కందుల నారాయణ రెడ్డి

గిద్దలూరు - అశోక్‌ రెడ్డి

ఆత్మకూరు - ఆనం రాంనారాయణ రెడ్డి

కోవూరు (నెల్లూరు)- వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

వెంకటగిరి - కురుగొండ్ల లక్ష్మీప్రియ

ఎమ్మిగనూరు - జయనాగేశ్వర రెడ్డి

మంత్రాలయం- రాఘవేంద్ర రెడ్డి

పుట్టపర్తి- పల్లె సింధూరా రెడ్డి

కదిరి- కందికుంట యశోదా దేవి

మదనపల్లె- షాజహాన్ బాషా

పుంగనూరు- చల్లా రామచంద్రా రెడ్డి (బాబు)

చంద్రగిరి- పులివర్తి వెంకట మణి ప్రసాద్ (నాని)

శ్రీకాళహస్తి- బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి

సత్యవేడు- కోనేటి ఆదిమూలం (ఎస్సీ)

పూతలపట్టు- డాక్టర్ కలికిరి మురళీ మోహన్


Read More
Next Story