ఎఫ్ఆర్ఎల్ (FULL RESRVOYER LEVEL-FRL) : 697.14 మీ.
నిల్వ సామర్థ్యం :- 5240.00 లక్షల గ్యాలన్లు
ప్రస్తుత నిల్వ :- 4345.00 లక్షల గ్యాలన్లు
2) గోగర్భం డ్యామ్ :- 2894.00 అడుగులు
ఎఫ్ఆర్ఎల్ (FULL RESRVOYER LEVEL-FRL) : 2894.00 అడుగులు
నిల్వ సామర్థ్యం :- 2833.00 లక్షల గ్యాలన్లు
ప్రస్తుత నిల్వ :- 2833.00 లక్షల గ్యాలన్లు
3) ఆకాశగంగ డ్యామ్ :- 857.85 మీ
ఎఫ్ఆర్ఎల్ (FULL RESRVOYER LEVEL-FRL) : 865.00 మీటర్లు
నిల్వ సామర్థ్యం :- 685.00 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ :- 306.50 లక్షల గ్యాలన్లు.
4) కుమారధార డ్యామ్ :- 891.00 మీటర్లు
ఎఫ్ఆర్ఎల్ (FULL RESRVOYER LEVEL-FRL) : 898.24 మీటర్లు
నిల్వ సామర్థ్యం :- 4258.98 లక్షల గ్యాలన్లు
ప్రస్తుత నిల్వ :- 2372.76 లక్షల గ్యాలన్లు
5) పసుపుధార డ్యామ్ :- 896.40 మీటర్లు
ఎఫ్ఆర్ఎల్ (FULL RESRVOYER LEVEL-FRL) : 898.24 మీటర్లు
నిల్వ సామర్థ్యం :- 1287.51 లక్షల గ్యాలన్లు
ప్రస్తుత నిల్వ :- 950.39 లక్షల గ్యాలన్లు
యాత్రికుల సంచారంపై నిషేధం
తిరుమలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా టీటీడీ అధికారులు ఆంక్షలు విధించారు. జలాశయాల పక్కకు ప్రధానంగా ఆ మార్గంలో రాకపోకలు నిషేధించారు. అందేలో ప్రధానంగా తిరుమలకకు సమీపంలోని గోగర్భం డ్యాం నుంచి పాపవినాశనం జలాశయం వరకు ఆలయాలు ఉన్నాయి. ఈ మార్గంలో వాహనాల రాకపోకలు శనివారం మధ్యాహ్నం నుంచే నిలిపివేశారు.
శ్రీవారిమెట్టు మార్గంలో...
తిరుమలకు అలిపిరితో పాటు శ్రీనివాసమంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్టు మార్గం నుంచి కూడా నడకమార్గంలో వెళ్లవచ్చు. తుపాను కారణంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల జలపాతాలు హోరెత్తుతున్నాయి. కొండకు ఎగువప్రాంతాల నుంచి నీటిప్రవాహం ఎక్కువగా ఉంది. దీంతో కొండచరియలు విరిగిపడే ప్రమాదంతో పాటు జలపాతాల వద్ద యాత్రికులు వెళితే ఊహించని ప్రమాదాలకు ఆస్కారం ఉందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. దీంతో శ్రీవారిమెట్టు మార్గాన్ని కూడా మూసివేశారు.
పోలీసులు అప్రమత్తం
తుపాను ప్రభావం తీవ్రంగా ఉండడంతో జిల్లా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆంధ్ర, తమిళనాడుకు సమీపంలో ఉన్న జిల్లాలోని పిచ్చాటూరు వద్ద ఆరణియార్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు అధికారులతో కలిసి ఈ జలాశయాన్ని సందర్శించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం ఉండాలని హెచ్చరించారు. జలాశయానికి దిగువన ఉన్న గ్రామాల ప్రజలకు ఏ సమయంలో ఏ అవసరమైనా సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.
అనుకోని ఇబ్బందులు ఏర్పడితే వెంటనే ఫోన్ నంబర్లు 112/ 8099999977 సంప్రదించాలని ఆయన ప్రజలకు సూచించారు. సమాచారం అందిన వెంటనే సాయం అందించడానికి సిద్ధంగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.