ఇదే మొదటిసారి..
రైల్వే కోడూరు అటవీ ప్రాంతానికి సమీపంలో చిట్వేలి మండలంలో పెద్దూరు నుంచి సుమారు 15 కిలోమీటర్ల ప్రయాణిస్తుంది గుండాలకోన ఒకటి ఉంది. ఓబులవారిపల్లె మండలం ఎర్రగుంటకోట నుంచి ఐదు నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం విషాద ఘటన చోటు చేసుకున్న ప్రదేశం నుంచి మరో గుండాల కోన కూడా ప్రకృతి ఒడిలో ఆహ్వానం పలుకుతూ ఉంటుంది. ప్రస్తుతం శివ భక్తులు ఎంచుకున్న మార్గం తలకోనకు వెళ్లడానికి తిరుపతి నుంచి ప్రత్యేక బస్సులు కూడా ఉన్నాయి.
ఇవన్నీ పక్కకు ఉంచితే, ఈ అటవీ ప్రాంతంలో సాధారణ వన్యప్రాణులకు తోడు చిరుతపులుల సంచారం కూడా ఎక్కువే. కానీ ఇంతవరకు ఎలాంటి దుర్ఘటన జరిగిన దాఖలాలు మాత్రం లేవు. దీనిపై బాలుపల్లె ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (forest range officer-fro) ప్రభాకర్రెడ్డి ఆసక్తికర విషయం చెప్పారు.
"బాలుపల్లి అటవీ ప్రాంతంలో ఒంటరి ఎనుగు ఉంది. చాలాసార్లు తారసపడింది. నేను ఫోటో కూడా తీశా" అని చెప్పారు. "ఓ సందర్భంలో సిబ్బందితో కలిసి అడవిలోకి వెళ్ళినప్పుడు ఏనుగుల మంద కూడా కనిపించింది. జాగ్రత్తగా అక్కడ నుంచి తప్పుకున్నాం" అని తన అనుభవాన్ని పంచుకున్నారు.
"అడవిలోకి వెళ్లే చాలామంది ఉంటారు. ప్రకృతి ప్రేమికులుగా టెక్కర్స్ మాకు మంచి స్నేహితులు. ముందస్తు సమాచారంతోనే వారు వస్తారు" అని చెబుతున్న ప్రభాకర్ రెడ్డి ఏనుగుల మానసిక స్థితిని అర్థం చేసుకొని మెలగాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అటవీ ప్రాంతాన్ని అధ్యయనం చేయడానికి వచ్చేవారు ముందస్తు సమాచారం ఇస్తారు. వారికి మెలకువలు చెబుతాం. ఎలా వెళ్లాలని కూడా గైడింగ్ మా సహకారం తీసుకుంటారు. అని ఎఫ్ఆర్ఓ ప్రభాకర్ రెడ్డి వివరించారు.
చిత్తూరు ఏనుగులేనా..
రైల్వే కోడూరు సమీపంలోని ఓబులవారిపల్లె మండలం ఎర్రగుంట కోట వద్ద దాడికి పాల్పడిన ఏనుగులు చిత్తూరు ప్రాంతం నుంచి ప్రవేశించ ఉండవచ్చు అనేది అటవీ శాఖ అధికారుల సందేహం.
చిత్తూరు జిల్లాలో కుప్పం నుంచి పలమనేరు వరకు, ఈ ప్రాంతంలో విస్తరించి ఉన్న కౌండిన్య అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల మంద ప్రవేశించి ఉండవచ్చు అనేది అటవీ అధికారుల అభిప్రాయం. కౌండిన్య అటవీ ప్రాంతం అటు కర్ణాటక ఇటు తమిళనాడు సరిహద్దుల్లో విస్తరించిన విషయం తెలిసిందే. ఈ అటవీ ప్రాంతానికి శేషాచలం అభయారణ్యం కూడా సమీపంలోనే ఉండడం వల్ల ఆ ప్రాంతం నుంచి ఏనుగులు ప్రవేశించబండవచ్చు అనే మాటలు వినిపిస్తున్నాయి.
"తమకు పరిచయం లేని అటవీ ప్రాంతంలోకి ప్రవేశించే ఏనుగులు అలవాటు పడే వరకు వాటి ప్రవర్తన విభిన్నంగా ఉంటుంది" అని ఎఫ్ ఆర్ ఓ ప్రభాకర్ రెడ్డి ఏనుగుల మానసిక స్థితిని వివరించారు.
గత నెలలో చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంది. ఇక్కడి మామిడి తోటల్లో ఏనుగుల దాడి సమాచారం తెలుసుకుని వెళ్లిన నారావారిపల్లె ఉపసర్పంచ్ ఏనుగుల దాడిలో మరణించిన విషయం తెలిసిందే.
ఓబులవారిపల్లి మండలం ఎర్రగుంట కోట వద్ద అటవీ ప్రాంతంలో ఏనుగులు శివ భక్తులపై దాడి చేసిన తీరు కూడా అలాగే ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నీరు ఆహారం కోసం ఈ ప్రాంతానికి వచ్చి ఉండవచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
"నారావారిపల్లి వద్ద, ప్రస్తుతం ఎర్రగుంట కోట వద్ద జరిగిన సంఘటనకు సారూప్యం ఉన్నట్లే కనిపిస్తోంది"అని ఎఫ్ఆర్ఓ ప్రభాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
గతంలో తనకు తారసపడిన ఏనుగుల మంద కూడా ఇదే కాదా అనేది చెప్పడం కష్టమన్నారు. అయితే, మందలో నుంచి ఓ ఏనుగు అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న పొలాలను పరిశీలించి వెళ్లే విధానం విచిత్రంగా ఉంటుందన్నారు. అది ఇచ్చే సంకేతాల ఆధారంగా ఏనుగుల మంద పంట పొలాలు, మామిడి తోటలపై దాడులకు దిగుతాయని ఆయన విశ్లేషించారు." ప్రస్తుతం సంచరిస్తున్న ఏనుగులు ఈ అటవీప్రాంతానికి కొత్త అయితే మాత్రం. వాటి ప్రవర్తన భిన్నంగా, భయంతో ఉంటుంది. ఈ పరిసరాలు అలవాటయ్యే వరకు మనుషులు కనిపిస్తే, దాడులకు దిగడానికి వెనకడుగు వేయకపోచ్చుమా బృందంలోని ఒక వ్యక్తి టిఫిన్ క్యారియర్ మూతతో భీకర శబ్దాలు చేశాడు. వెంటనే ఏనుగులు మాపైకి దూసుకుని వచ్చాయి. అని సిద్ధయ్య చెప్పాడు. చప్పుడు చేయకుండా జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేదేమో అని అభిప్రాయం కూడా ఆంజనేయులు వ్యక్తం చేశాడు. అని ఎఫ్ఆర్ఓ ప్రభాకరరెడ్డి అభిప్రాయపడ్డారు.
అటవీ పల్లెల వద్ద భయం
ఈ ఘటనతో అటవీ సమీప గ్రామాలు భయంతో ఉన్నాయి. ఈ ప్రాంతం మామిడి తోటలకు ప్రసిద్ధి, అంతేకాకుండా, బొప్పాయి తోటల సాగు కూడా విస్తారంగా ఉంటుంది. రైల్వే కోడూరు ప్రాంతంలో మామిడి తోటలు 20వేల హెక్టార్లు, అరటి 17 వేల హెక్టార్లు, బొప్పాయి 15వేల హెక్టార్లలో సాగులో ఉంది. రేణిగుంట నుంచి కడపకు వెళ్లేమార్గంలో మామండూరు నుంచి రైల్వే కోడూరు మండలం అటవీప్రాంతం నుంచే ప్రారంభం అవుతుంది. ఇది ఇలాగే ఓబులవారిపల్లె, పుల్లంపేట మండలాల మీదుగా రాయచోటి నియోజకవర్గంలోని సుండుపల్లె, వీరబల్లె, రామాపురం, కడప వరకు విస్తరించి ఉంది. చిట్వేలి మండల కేంద్రం నుంచి రాపూరు మార్గం, రైల్వేకోడూరు నుంచి చిట్వేలి మార్గంలో రాపూరు అడవులు దట్టంగా ఎర్రచందనం వనాలతో విస్తరించి ఉంది. ఈ ప్రాంతానికి చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంత కౌండిన్య అరణ్యం నుంచి తిరుపతి శేషాచలం అటవీప్రాంతం విస్తరించి ఉన్న సమీప గ్రామాల్లోని తోటల వద్దకు వెళ్లడానికి రైతులు, ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. అటవీ సమీప గ్రామాల్లో ఆ శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.