
Tirumala|| తిరుమల ఆర్జిత సేవా టికెట్లు విడుదల.
సెప్టెబంర్ నెల దర్శన కోటా విడుదల వివరాలు.
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. అయితే దర్శనం, ఆర్జిత సేవల్ని ప్లాన్ చేసుకునే భక్తుల కోసం టీటీడీ ప్రతి నెలా ఆన్లైన్ కోటాను విడుదల చేస్తోంది. సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. అయితే దర్శనం, ఆర్జిత సేవల్ని ప్లాన్ చేసుకునే భక్తుల కోసం టీటీడీ ప్రతి నెలా ఆన్లైన్ కోటాను విడుదల చేస్తోంది. సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జూన్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయి.