తిరుమల హోటళ్ల ధరలపై టీటీడీ క్లారిటీ
x

తిరుమల హోటళ్ల ధరలపై టీటీడీ క్లారిటీ

సోషల్ మీడియా వేదికగా హోటళ్ల ధరల పట్టిక వైరల్ - స్పందించిన టీటీడీ


తిరుమల శ్రీవారిని దర్శించుకోడానికి ప్రతిరోజు భక్తులు దేశ, విదేశాల నుంచి తరలివస్తుంటారు. భక్తుల కోసం వసతి సదుపాయాలను కల్పిస్తోంది. అన్న ప్రసాదాలను ఉచితంగా అందిస్తోంది. అదే సమయంలో తిరుమల పై అనేక హోటల్స్ కూడా ఉన్నాయి.

ఈ హోటల్లో దొరికే ఆహార పదార్ధాల ధరలు తగ్గయంటూ ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు తమ దృష్టికి వచ్చాయని.. ఈ వార్తలు పూర్తిగా అసత్యం అని దీనిని భక్తులు నమ్మవద్దు అంటూ టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
తగ్గిన ఆహార పదార్థాల ధరలు అంటూ ప్రచారం చేస్తున్న వార్తలతో పాటు, ఇతర వివరాలు పూర్తిగా అబద్ధమని వెల్లడించింది. అంతేకాదు ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.
తిరుమల తిరుపతి క్షేత్రానికి సంబంధించిన ఏ విషయంపై ఎటువంటి సమాచారం భక్తులకు కావల్సినా అధికారిక టీటీడీ వెబ్ సైట్ www.tirumala.org ని సందర్శించడం ద్వారా లేదా టీటీడీ కాల్ సెంటర్ 18004254141కి ఫోన్ చేసి మాత్రమే తెలుసుకోవాలని అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు.


Read More
Next Story