వాట్సప్‌ మెసేజ్ కు మంత్రి లోకేష్ స్పందించారు. దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేక జిఓ విడుదల చేశారు. ఐఐటి, ఎన్‌ఐటి, ట్రిపుల్‌ ఐటీల్లో వారికి అవకాశం దక్కింది.


చదువు విలువ ఎలా ఉంటుందో తనకు తెలుసు. జ్ఞాన నేత్రం ద్వారా ప్రపంచాన్ని చూడొచ్చు. ఆ చదువును అందరూ అందుకోవాలంటే దాని విలువ తెలిసిన వారు ప్రభుత్వంలో మంత్రి స్థానంలో ఉండాలి. స్టాన్‌ ఫోర్డ్‌ యూనివర్సిటీలో ఎంబిఎ చేసిన రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్‌ దివ్యాంగ విద్యార్థులు తన దృష్టికి తెచ్చిన ఓ సమస్యపై మెరుపు వేగంతో స్పందించి 25మంది భావి భారత పౌరుల బంగారు భవిష్యత్తును కాపాడారు. మంత్రి చూపిన చొరవతో ఆ విద్యార్థులు దేశ వ్యాప్తంగా పేరెన్నిక గన్న ఐఐటి, ఎన్‌ఐటి వంటి విద్యాసంస్థల్లో ప్రవేశం పొందగలిగారు. ప్రతి సోమవారం తన నివాసంలో ప్రజలతో ప్రజాదర్బార్‌ కార్యక్రమం ద్వారా కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తున్నారు.

విజయవాడకు చెందిన దివ్యాంగ విద్యార్థి మారుతీ పృద్వి సత్యదేవ్‌ ఈ ఏడాది నిర్వహించిన జెఇఇ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో దివ్యాంగుల కోటాలో 170వ ర్యాంకు సాధించాడు. ఈ ర్యాంకు ప్రకారం సత్యదేవ్‌ కు చెన్నయ్‌ ఐఐటిలో సీటు రావాల్సి ఉంది. అయితే దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే మార్కుల మెమో విషయంలో రాష్ట్ర ఇంటర్మీడియట్‌ అధికారులు ఎప్పటినుంచో చేస్తున్న ఓ పొరపాటు దివ్యాంగ విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెట్టింది. జెఇఇ అడ్వాన్స్‌ డ్‌ పరీక్షలో ర్యాంకు సాధించిన దివ్యాంగుడైన సత్యదేవ్‌ తనకు ఇంటర్మీడియట్‌ బోర్డు సర్టిఫికేట్‌ అప్‌ లోడ్‌ విషయంలో ఎదురైన సమస్యను వాట్సప్‌ ద్వారా మంత్రి లోకేష్‌ కు తెలియజేశారు. వెంటనే స్పందించిన లోకేష్‌ సంబంధిత విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలంటూ ఉన్నతాధికారులను ఆదేశించి సమస్యను పరిష్కరించారు.
విజయవాడకు చెందిన సత్యదేవ్‌ కు తాను సాధించిన ర్యాంకు ప్రకారం జోసా కౌన్సెలింగ్‌ రౌండ్‌ –1లో ఐఐటి మద్రాసులో సీటు కేటాయించారు. అయితే డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియలో భాగంగా ఇంటర్మీడియట్‌ మెమోను అప్‌లోడ్‌ చేయాలని అడిగారు. ఏపీ ఇంటర్మీడియట్‌ బోర్డు నిబంధనల ప్రకారం దివ్యాంగులకు లాంగ్వేజ్‌ సబ్జెక్ట్‌ లు రెండింటిలో ఒకదానికి మినహాయింపు ఉంది. దీని ప్రకారం సత్యదేవ్‌ సెకండ్‌ లాంగ్వేజ్‌ పరీక్ష రాయలేదు. ఇంటర్‌ పరీక్షలలో ‘ఎ’ గ్రేడ్‌లో ఉత్తీర్ణత సాధించాడు. మినహాయింపు పొందిన లాంగ్వేజ్‌ సబ్జెక్ట్‌ తో కలిపి మార్కుల మెమోలో 5 సబ్జెక్ట్‌ లకు మార్కులు ఉంటాయి. మినహాయింపు పొందిన సబ్జెక్టుకు సంబంధించి సర్టిఫికేట్‌లో ఇంటర్మీడియట్‌ బోర్డు వారు ఎప్పటినుంచో ’ఉ’ (ఉగీఉM్కఖీఐౖN) అని మాత్రమే పేర్కొంటూ జారీచేస్తున్నారు. కానీ ఐఐటీ మద్రాస్‌ డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ విభాగం వారు సత్యదేవ్‌ మెమోలో కేవలం 4 సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయని, మ్యాథ్స్‌ ఎ, మ్యాథ్స్‌ బి లను ఒకే సబ్జెక్ట్‌గా పరిగణిస్తున్నామని, అందువల్ల మీ ఇంటర్మీడియట్‌ మార్క్స్‌ లిస్ట్‌ను అంగీకరించబోమని సమాచారమిచ్చారు. దీనిపై సత్యదేవ్‌ ఐఐటి మద్రాసు వారిని సంప్రదించగా, సెకండ్‌ లాంగ్వేజ్‌ సబ్జెక్టుకు సంబంధించి మార్క్స్‌ లిస్ట్‌లో ‘ఇ’ స్థానంలో నిర్దిష్ట సంఖ్యా విలువ ఉంటేనే కళాశాలలో ప్రవేశానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. తన కెరీర్‌ మొత్తం ఈ ఫలితంపై ఆధారపడి ఉంది. నా జీవితాంతం నేను మీకు రుణపడి ఉంటాను. ఈ పరిస్థితి నుండి బయటపడేయడానికి దయచేసి నాకు సహాయం చేయాలని 2024 జూన్‌ 22న మంత్రి లోకేష్‌ కు వాట్సప్‌ ద్వారా మెసేజ్‌ చేశారు.
వెంటనే స్పందించిన లోకేష్‌ ఐఐటిలో ర్యాంకు సాధించిన దివ్వాంగ విద్యార్థి పృద్వి సత్యదేవ్, అతని తండ్రి జయరామ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మినహాయింపు పొందిన సెకండ్‌ లాంగ్వేజ్‌ లో ఉ (ఉ్ఠ్ఛఝp్టజీౌn)కు బదులుగా మార్కులతో ఇంటర్మీడియట్‌ సర్టిఫికేట్‌ ఇవ్వాలని బోర్డు అధికారులను ఆదేశించారు. వెంటనే ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు స్పందించి ‘ఇ’కి బదులు కనిష్టంగా 35మార్కులు వేసి మార్కుల మెమో జారీచేశారు. తీరా మార్కులతో సర్టిఫికెట్‌ తీసుకెళ్లిన విద్యార్థికి తాము దీనిని అంగీకరించబోమని, ఎపి ప్రభుత్వం నుంచి జిఓ కావాలని మెలిక పెట్టారు. ఇదే విషయాన్ని పృద్వి సత్యదేవ్‌ మళ్లీ మంత్రి లోకేష్‌ పేషీకి ఫోన్‌ ద్వారా తెలియజేశారు. సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి విద్యార్థుల భవిష్యత్‌ దెబ్బతినకూడదని, వెంటనే జిఓ విడుదల చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అవసరమైతే చెన్నయ్‌ ఐఐటి అధికారులతో మాట్లాడాలని సూచించారు. ఆగమేఘాలపై జిఓను అధికారులు విడుదల చేశారు. దీంతో సత్యదేవ్‌ కు ఐఐటి మద్రాసులో సీటు లభించింది. ఈ జిఓ విడుదలతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 25మంది దివ్యాంగ విద్యార్థులకు జాతీయస్థాయిలో పేరొందిన ఐఐటి, ఎన్‌ఐటి, ట్రిపుల్‌ ఐటి వంటి ప్రఖ్యాత విద్యాసంస్థల్లో సీట్లు లభించాయి. తన భవిష్యత్తును కాపాడిన మంత్రి లోకేష్‌ కు సత్యదేవ్‌ తోపాటు దివ్యాంగ విద్యార్థులు కృతజఞతలు తెలిపారు. సకాలంలో లోకేష్‌ అందించిన ఈ సాయానికి తాము జీవితాంతం రుణపడి ఉంటామని వారు చెప్పారు. నేడు ఉండవల్లి నివాసంలో ఐఐటి, ఎన్‌ఐటి, ట్రిపుల్‌ ఐటి వంటి విద్యాసంస్థల్లోప్రవేశం పొందిన దివ్యాంగ విద్యార్థులను విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ అభినందించారు.
జాతీయస్థాయిలో సీట్లు సాధించిన విద్యార్థుల పేర్లు
1. ఎం పృద్వీ సత్యదేవ్, విజయవాడ – ఐఐటి, మద్రాస్‌.
2. ఎన్‌ స్నేహిత, నెల్లూరు – ఐఐటి, కాన్పూర్‌.
3. ఎ తేజిత చౌదరి, తిరుపతి – ఐఐఐటి, గౌహతి.
4. పి నిష్మిత, నెల్లూరు – ఎన్‌ఐటి, నాగపూర్‌.
5. సి రఘునాథరెడ్డి, విజయవాడ – ఐఐటి, క్యాలికట్‌.
6. ఎం మోహన్‌ నాగమణికంఠ, రాజమండ్రి – ఎన్‌ఐటి, జలంధర్‌.
7. బి విజయరాజు, పామర్రు – ఐఐటి, తిరుపతి.
8. కె ప్రశాంత్, కర్నూలు – ఎన్‌ఐటి, సిల్చార్‌.
10. జి కృష్ణసాయి సంతోష్, విజయవాడ – ఎన్‌ఐటి, సూరత్కల్‌.
11. జి వంశీ కృష్ణ, రాజమండ్రి – ఎన్‌ఐటి, వరంగల్‌.
12. వి వేదచరణ్‌ రెడ్డి, కర్నూలు – ఐఐటి, మద్రాసు.
13. నాయుడు రక్షిత్, నెల్లూరు – ఎన్‌ఐటి, నాగాల్యాండ్‌.
14. ఇ మహీధర్‌ రెడ్డి, పెనమలూరు – ఐఐటి, ఇండోర్‌.
15. డి మోక్షశ్రీ, అనంతపురం – ఎన్‌ఐటి, నాగాల్యాండ్‌.
16. పి దినేష్, రాజమండ్రి – ఎన్‌ఐటి, కురుక్షేత్ర.
17. జె మనోజ్‌ కుమార్, బి.కోట – ఐఐటి, గోవా.
18. సిహెచ్‌ శివరామ్, నందిగామ – ఐఐటి, అగర్తల.
19. బి అబిజిత్, విజయవాడ – ఎన్‌ఐటి, అరుణాచల్‌ ప్రదేశ్‌.
20. జి రాణి, కాకినాడ – ఐఐటి, ఖరగ్‌ పూర్‌.
21. కె గోకుల్‌ సాయి, గుంటూరు – ఎన్‌ఐటి, తాడేపల్లిగూడెం.
22. ఎం అభిలాష్, విజయవాడ – ఐఐటి, తిరుపతి.
23. ఎం అర్జున్‌ కుమార్, గుంటూరు – సెకండ్‌ రౌండ్‌ కు దరఖాస్తు.
24. ఆర్‌ఎస్‌ భరద్వాజ నాయుడు, తాళ్లవలస – ఎన్‌ఐటి, సిల్చార్‌.
25. జి రేష్మిత, ఎనికేపాడు – ఐఐటి, తిరుపతి.
Next Story