చిత్తూరు జిల్లా రైతు ఎందుకు విషాదంలో ఉన్నారు?
x
చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురంలోని పరిస్థితి ఇలా ఉంది...

చిత్తూరు జిల్లా రైతు ఎందుకు విషాదంలో ఉన్నారు?

మామిడి చెట్లను కూల్చివేయడం వెనుక రైతు బాధ ఎలా ఉందంటే...


చిత్తూరు జిల్లా మామిడి తోటల రైతాంగంతో ధరలు దోబూచులాడుతున్నాయి. రామచంద్రాపురం మండలంలో మామిడి తోటల రైతులకు పెద్దకష్టం వచ్చింది. నష్టాలు భరించలేక కన్నబిడ్డల్లా పెంచిన వందలాది ఎకరాల్లో 40 ఏళ్ల వయసు మామిడి చెట్లను నిలువునా నరికి వేస్తున్నారు. మొదళ్లతో సహా పెకిలించి, వంటచెరుకుగా విక్రయిస్తున్న దయనీయ స్థితి ఇది.

"ఈ సీజన్లో చివరి కాయ వరకు కొంటాం. కిలో కు 12 రూపాయలు మద్దతు ధర నిర్ణయించాం" అని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, తిరుపతి కలెక్టర్ డాక్టర్ వి. వెంకటేశ్వర్ ప్రకటించారు. ప్రభుత్వం నాలుగు రూపాయలు, గుజ్జు పరిశ్రమల యజమానులు ఎనిమిది రూపాయలు చెల్లించే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు ర్యాంపుల వద్ద అధికారులను నియమించారు. గుజ్జు పరిశ్రమల యజమానులతో చర్చించారు. ప్రభుత్వ నిర్ణయం సజావుగా అమలు చేస్తుంటే..

నేలకు ఒరిగిన మామిడి చెట్లు

తిరుపతికి శివారులోని చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలో వేలాది ఎకరాల్లో మామడి చెట్లను నిట్టనిలువునా నరికివస్తున్న దృశ్యాలు చేసే, వారి కంట కూడా కన్నీరుకారుతోంది. రైతుల పరిస్థితి, వారి గుండెల్లో వేదన మాటలకు అందని బాధ కనిపిస్తోంది.
సాగులో అగ్రగామి
రాష్ట్రంలో అత్యధికంగా మామిడి తోటల సాగు, దిగుబడి సాధిస్తున్న కృష్ణా జిల్లా సరసన చిత్తూరు జిల్లా రైతాంగం కూడా చేరింది. జిల్లాలో ఎనిమిది లక్షల టన్నుల మామిడి కాయలు దిగుబడి వస్తుందనేది ఉద్యానవన శాఖాధికారుల అంచనా. ప్రధానంగా పల్ప్ పరిశ్రమకు అవసరమైన తోతాపురి రకం మామిడిని అధికంగా సాగు చేస్తారు.
చిత్తూరు జిల్లాలో 1,40,000 ఎకరాల్లో మామిడి సాగు అవుతుంది. ఇందులో తోతాపురి 99,737, నీలం 14545, అల్ఫోనో 7817, బెనిష 9737, మల్లిక 4350 ఎకరాలు, ఇతర రకాలు 3815 ఎకరాల్లో సాగవుతుంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా తోతాపురి రకం కాయలు 90 శాతం పక్వానికి వచ్చేశాయి.
తలవాల్చిన మామిడి చెట్లు

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కండలు కరిగించారు. రేయి, పగలు శ్రమించారు. రెక్కలు ముక్కలు చేసుకున్న రామచంద్రాపురం మండలం గంగిరెడ్డిపల్లె, కమ్మకండ్రిగ తోపాటు సమీప గ్రామాల వద్ద ఉన్న సుమారు వందేళ్ల నాటి చెట్లతో పాటు 40 ఏళ్లకు లోపు ఉన్న మామిడి తోటలను తెగనరికేస్తున్నారు. రైతులు తోటలు నేల కూలుస్తూ, వలవల ఏడుస్తున్నారు. ఆ చెట్లను వంట చెరుకుగా విక్రయిస్తున్న దయనీయ పరిస్థితి ఏర్పడింది.
"ఈ ఏడాది గిట్టుబాటు ధర లభించని స్ధితిలో ప్రతి సంవత్సరం ఈ కష్టం వృధా అవుతోంది. బాధలు కూడా తప్పడం లేదు. అప్పులు మిగులుతున్నాయి" అనే వేదన వ్యక్తం చేశారు. కన్నబిడ్డల్లా పెంచిన మామిడి చెట్లను నిట్టనిలువునా నరికి వేశారు. ఈ దృశ్యాలు రోడ్డున వెళ్లే వారిని కూడా వేదనకు గురి చేస్తున్నాయి. తోటల యజమానులైన రైతులు మండతున్న గుండెలతో గుడ్ల నీరు కక్కుకుంటున్నారు.
ఉపాధి హామీ పుణ్యమా అని..
తిరుపతికి సమీపంలోని రామచంద్రాపురం మండలంలో 30 ఏళ్ల కిందటి వరకు వెయ్యి ఎకరాల్లో మాత్రమే మామిడి తోటలు సాగులో ఉన్నాయి. ఉపాధిహామీ పథకం పుణ్యమా అని అన్ని సామాజిక వర్గాల వారికి అదృష్టం కలిసొచ్చింది. వంద శాతం సబ్సిడీ ఇవ్వడం వల్ల ఆ తోటల సంఖ్య దాదాపు ఐదు వేల ఎకరాల వరకు పెరిగినట్లు ఉద్యానవన శాఖాధికారుల కథనం.
అప్పుల కుప్ప..
ఈ ఏడాది దిగుబడి గణనీయంగా పెరిగింది. కిలో మామిదికి ప్రభుత్వం 12 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. అందులో ప్రభుత్వం నాలుగు రూపాయలు చెల్లిస్తే, గుజ్జ పరిశ్రమల ద్వారా 8 రూపాయలు చెల్లించే విధంగా ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమల యజమానులు ఏర్పాటు చేసుకున్న ర్యాంపుల వద్ద మామిడి కాయలు కొనుగోలు చేసే వ్యాపారులు కిలోకు కనీసం మూడు రూపాయలు కూడా ఇవ్వని స్థితిలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎకరా విస్తీర్ణంలో తోటలకు సస్యరక్షణ, కోత, రవాణా ఖర్చులు కలిపితే టన్నుకు నుంచి ఏనిమిది వేల వకరకు ఖర్చ వస్తుంది. గుజ్జ పరిశ్రమల వద్దకు వెళితే, అందులో సగం ధర కూడా గిట్టుబాటు కాని స్థితిలో రైతులు వేదనకు గురవుతున్నారు.
చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమలు పూర్తిస్థాయిలో తెరవకపోవడం ఒక కారణమైతే. ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమలు కూడా సామర్ధ్యానికి తగినట్లు పనిచేయకపోవడం. బహిరంగ మార్కెట్ లో కిలో మూడు నుంచి నాలుగు రూపాయలు ఉంటే, ఎనిమిది ఎలా చెల్లించగలం? కొన్ని పరిశ్రమల వద్దకు టోకెన్లు లేకున్నా, మామిడికాయల లోడుతో వెళ్లిన ట్రాక్టర్లు కిలోమీటర్ల కొద్ది బారులు తీరాయి. ఈ ఏడాది మామిడి దిగుబడి అధికంగా ఉన్నప్పటికీ, మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పూర్తి కథనం

On The Federal Andhra Pradesh YouTube ఛానల్ లో చూడండి



Read More
Next Story