అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని, తోడుగా నిలబడుతుందని జగన్‌ అన్నారు.


వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించి ఈ రోజుతో 15 ఏళ్లు అవుతోంది. ఈ 15 సంవత్సరాల ప్రయాణంలో తొలి రోజు నుంచి ప్రజల సమస్యల మీదనే పని చేస్తోంది. ప్రజల కష్టాల నుంచే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టింది. ప్రజల కష్టాలను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరపున వాయిస్‌ ఆఫ్‌ ద వాయిస్‌లెస్‌ కింద అడుగడుగున పని చేస్తూ వస్తోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పడి 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని, 15వ ఏటలోకి అడుగుపెట్టని నేపథ్యంలో తాడేపల్లి వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి.

ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో కూర్చోవడం మనకు కొత్త కాదు. ఈ 15 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రభుత్వాలకు ధీటైన సమాధానం ఇస్తూనే వచ్చాం. కళ్లు మూసుకొని కళ్లు తెరిచే సమయానికి ఎన్నికలు అయిపోయి ఇప్పటికే ఏడాది అయిపోయింది. మరో మూడు, రెండు సంవత్సరాలల్లో ఈ సారి అధికారంలోకి వచ్చేది వైఎస్‌ఆర్‌సీపీనే అంటూ మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి పేద వాడి ఇంటికి వెళ్లినప్పుడు కానీ, ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి తాత, ప్రతి అవ్వ, ప్రతి రైతన్న వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తను చూసి చక్కటి చిరునవ్వుతో పలకరిస్తారు. అందుకు కారణం వైఎస్‌ఆర్‌సీపీ చెప్పిందంటే చేస్తుందనే నమ్మకమే. అదే ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉందని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం మీద ఆయన విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో కూటమి ఇచ్చిన సూపర్‌ సిక్స్‌లు గాలికి ఎగిరి పోయాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు. సంవత్సరం కాలం కావస్తున్నా విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్‌ చెల్లించ లేదు. బకాయిలన్నీ అలానే ఉన్నాయి. విద్యార్థుల ఫీజు రియంబర్స్‌మెంట్‌కు వాలసింది, క్వార్టర్‌కు రూ. 700 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 2800 విద్యా దీవెన కింద ఫీజు రియంబర్స్‌మెంట్‌ కోసం కేటాయింపులు చేయాలి. వసతి దీవెన కింద రూ. 1100 కోట్లు కేటాయించాలి. కూటమి వచ్చి తర్వాత వీటిని నిర్లక్ష్యం చేసింది. ఈ ఏడాది కాలంలో విద్యార్థులకు కూటమి సర్కార్‌ చేసింది రూ. 700 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. రూ. 3200 కోట్లు పెండింగ్‌లో పెట్టారు.
ఈ విద్యా సంవత్సరంలో రూ. 7100 కోట్లకు సంబంధించి విద్యార్థులకు కేటాయించాలి, కానీ కేవలం రూ. 2,600 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు. పిల్లల చదువులతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి బుద్ది చెప్పడం కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. దీనిలో పాల్గొన్న ప్రతి వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త, నాయకులకు వైఎస్‌ఆర్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు, ప్రజలకు తోడుగా ఉంటుంది. ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పడి 14 ఏళ్లు పూర్తి చేసుకొని, 15వ ఏడాదిలోకి అడుగుతున్న సందర్భంలో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులకు జగన్ అభినందనలు తెలిపారు. తనతో సడుస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Next Story