‘కులాల వారీగా జన గణన చేపట్టాలి’
x

‘కులాల వారీగా జన గణన చేపట్టాలి’

జన గణన తీర్మానానికి బీజేపీతో సహా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన శాసనసభ్యులు మద్దతు పలికారు. తీర్మానాన్ని ఆమోదించినట్లు స్పీకర్ ఎం.అప్పావు ప్రకటించారు.


కుల ప్రాతిపదికన జనాభా గణనను చేపట్టాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు తమిళనాడు అసెంబ్లీ బుధవారం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఈసారి కుల ప్రాతిపదిక జనాభా గణనతోపాటు 2021 నుంచి జరగాల్సిన జనాభా గణనను కేంద్రం వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీర్మానం చేశారు.

సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించినందుకు అసెంబ్లీ నుంచి ప్రధాన ప్రతిపక్ష అన్నాడీఎంకే సభ్యులను సస్పెండ్ చేశారు. సభ ఆమోదించిన తీర్మానానికి బీజేపీతో సహా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన శాసనసభ్యులు మద్దతు పలికారు. తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్ ఎం.అప్పావు ప్రకటించారు.

Read More
Next Story