సీపీఎం పాలనలో కూడా గూండారాజ్ : కాంగ్రెస్
x

సీపీఎం పాలనలో కూడా గూండారాజ్ : కాంగ్రెస్

కేరళలో అధికారంలో ఉన్న సీపీఎం పార్టీ గుండారాజ్ తీసుకొచ్చిందని కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించింది. దాని సంస్థలు రాష్ట్రంలో దాడులకు పాల్పడుతున్నాయని..


కేరళలో అధికార సీపీఐ(ఎం) విద్యార్థి సంస్థ, ఎస్‌ఎఫ్‌ఐ, ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్, సిఐటియు విస్తృతంగా హింసకు పాల్పడుతున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ రెండు గ్రూపులు లెఫ్ట్ పార్టీ "గుండా టీమ్‌లు" అని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.

సీఐటీయూ నాయకులు ఎడప్పాల్ లోని ఓ అన్ లోడింగ్ చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడిపై దాడి చేసినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. ఇది రెండు రోజుల క్రితం చోటు చేసుకుందని వివరించింది. దీనిపై కాంగ్రెస్ కేపీసీసీ అధ్యక్షుడు కే సుధాకరన్ ఆదివారం సీపీఎం పార్టీపై విరుచుకుపడ్డాడు. వామపక్ష పక్ష పార్టీ రాష్ట్రంలో రౌడీయిజం చేస్తోందని విమర్శలు గుప్పించారు.
'శాంతియుత ప్రజా వ్యవస్థ '
క్యాంపస్‌లలో ఘర్షణలపై ఎస్‌ఎఫ్‌ఐపై కొన్ని ఆరోపణలను ప్రస్తావిస్తూ, రెండు వామపక్ష సంస్థలు శాంతియుత ప్రజా చర్చను దెబ్బతీస్తున్నాయని సుధాకరన్ అన్నారు.
"లోడింగ్, అన్‌లోడ్ పనులపై సిఐటియు నాయకులు ఒక వ్యక్తిపై దాడి చేశారు. సిఐటియు కార్మికుల దాడి నుంచి పారిపోతుండగా ఫయాస్ షాజహాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్‌ఎఫ్‌ఐ, సిఐటియు సంస్థలు సిపిఎం గుండా టీమ్‌లుగా మారాయి" అని సుధాకరన్ ఆరోపించారు.
ఆరోపణలను తిరస్కరించిన సీఐటీయూ..
అయితే, సిఐటియు ఈ ఆరోపణలను ఖండించింది.లోడింగ్ ప్రక్రియలో ఎలాంటి గొడవలు జరగలేదని వివరణ ఇచ్చారు. ఒక వ్యక్తి భవనంపై నుంచి పడిపోయినట్లు గుర్తించామని, వెంటనే ఆస్పత్రికి తరలించామని సీఐటీయూ కార్మికులు తెలిపారు.
"అన్‌లోడ్ పనులు కాంట్రాక్టు కార్మికులు పూర్తి చేశారు. భవిష్యత్‌లో పనులు మాకే ఇస్తామని హామీ ఇచ్చేందుకు వెళ్లాం. చర్చల సమయంలో తమ సభ్యుల్లో ఒకరు తప్పిపోయినట్లు గుర్తించారు. పక్కనే ఉన్న భవనంలో అతను కనిపించాడు" అని సిఐటియు పేర్కొంది.
'హత్య ఆరోపణలు చేయని పోలీసులు'
అయితే సిఐటియు కార్మికులపై హత్యాయత్నం కేసు పెట్టేందుకు పోలీసులు సిద్ధంగా లేరని సుధాకరన్ ఆరోపించారు. కాగా, తనపై దాడి చేశారంటూ గాయపడిన వ్యక్తి ఫిర్యాదు మేరకు సీఐటీయూ కార్మికులపై కేసు నమోదు చేశారు.
Read More
Next Story