వృషణాలు పగిలిపోయాయి.. ప్రయివేట్ పార్ట్ కు షాక్: దర్శన్ క్రూరత్వం
x

వృషణాలు పగిలిపోయాయి.. ప్రయివేట్ పార్ట్ కు షాక్: దర్శన్ క్రూరత్వం

ప్రయివేట్ భాగాలకు కరెంట్ షాక్, వృషణాలు పగిలిపోయేలా కొట్టారు. ఒక చెవి లేదు.. కన్నడ నటుడు దర్శన్ తోగుదీపు, తన అభిమానిపై క్రూరంగా ప్రవర్తించి ఎలా హత్య చేశాడో..


వేరే హీరోయిన్ తో సహజీవనం చేస్తున్నాడని ఆయనకు హితబోధ చేయబోయాడు. అలాగే తన అభిమాన హీరోను వదిలిపెట్టి ఆయన భార్య తో ఉండనివ్వమని సహజీవనం చేస్తున్న కథానాయికకి సామాజిక మాధ్యమాల ద్వారా మెసెజ్ లు పెట్టాడు. దీనికే కక్ష గట్టి తన అభిమాని అని చూడకుండా కన్నడ నటుడు, దర్శన్ తొగుదీప, అతని ముఠా అత్యంత పాశవికంగా బాధితుడు రేణుకాస్వామిని హత్య చేసిన విషయం తెలిసిందే. దీనిపై బెంగళూర్ పోలీసులు కోర్టుకు సమర్పించిన వాటర్ రైట్ చార్జీషీట్ అనేక భయానక వివరాలు వెల్లడించారు.

చార్జీషీట్ ప్రకారం.. చిత్రదుర్గ నివాసి రేణుకాస్వామిని బలవంతంగా ఎత్తుకొచ్చిన ముఠా.. తీవ్రంగా చావబాదడమే కాదు, అతని ప్రయివేట్ భాగాలకు కరెంట్ షాక్ పెట్టి దారుణంగా హింసించినట్లు పోలీసులు తేల్చారు. ఈ చార్జీషీట్ ప్రస్తుతం బయటపడటంతో దర్శన్ తోగుదీప ఎంత క్రూరంగా ప్రవర్తించడో చూసి రాష్ట్రం నివ్వేరపోయింది. రాష్ట్రాన్ని, కన్నడ చిత్ర పరిశ్రమను కుదిపేసిన షాకింగ్ నేరంలో జైలు శిక్ష అనుభవిస్తున్న నటుడు దర్శన్ పాత్రను ఇందులో స్పష్టంగా వివరించారు.
పగిలిన వృషణాలు, అమానవీయ హింస
ఇప్పుడు, ఛార్జిషీట్‌లో రేణుకాస్వామి తన మరణానికి ముందు అనుభవించిన హింసను సమగ్రంగా వివరించింది. దర్శన్, అతని గ్యాంగ్ రేణుకాస్వామిని తీవ్రంగా కొట్టడంతో అతని ఛాతీ ఎముకలు విరిగిపోయాయి. "ఇంకా, అతని శరీరం అంతటా 39 గాయాల గుర్తులు ఉన్నాయి. బాధితుడి తలపై లోతైన కోసిన గుర్తులు ఉన్నాయి" అని ఛార్జిషీట్ పేర్కొంది.
అంతేకాకుండా, రేణుకాస్వామి ప్రైవేట్ భాగాలకు విద్యుత్ షాక్‌లను అందించడానికి గ్యాంగ్ మెగ్గర్ మెషిన్, ఇన్సులేషన్ నిరోధకతను కొలిచే ఎలక్ట్రికల్ పరికరాన్ని ఉపయోగించినట్లు సమాచారం.రేణుకాస్వామి వృషణాన్ని డ్యామేజ్ చేసేందుకు మెగర్ డివైజ్‌ను ఉపయోగించారని చార్జిషీట్‌లో వెల్లడించింది.
చిత్రదుర్గ నివాసిని నరికి చంపబడటానికి ముందు బయటకు చెప్పరాని, అమానవీయ హింసను అనుభవించాడు. అతని శరీరంపై అనేక గాయాలతో పాటు, ఒకచెవి లేదు, వృషణాలు పగిలిపోయి ఉన్నాయని చార్జీషీట్ పేర్కొంది. ఇంతటి దారుణమైన నేరం చేసిన తర్వాత దర్శన్ ఇతర నిందితులు తమ పలుకుబడి, డబ్బును ఉపయోగించి మృతదేహాన్ని పారవేసేందుకు, సాక్ష్యాలను నాశనం చేయడానికి ఎలా ప్రయత్నించారో ఛార్జిషీట్ పేర్కొంది. వారు ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి ఇతర వ్యక్తులను కూడా ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నించారని పోలీసులు పేర్కొన్నారు.
అలాగే, దర్శన్ దుస్తులపై రేణుకాస్వామి రక్తం మరకలు ఉన్నాయి. కిడ్నాప్, నిర్బంధంలో, చిత్రహింసలు, హత్య, బాధితుడి మృతదేహాన్ని పారవేసే సమయంలో అతని సహచరులు పంపిన సందేశాలను కూడా వారు తిరిగి సేకరించగలిగారు. చార్జిషీట్‌లో, పోలీసులు దర్శన్ ఇతర నిందితుల దుస్తులపై రక్తపు మరకలను సూచించే ఫోరెన్సిక్ నివేదికలతో సహా 200కి పైగా సందర్భోచిత ఆధారాలను సమర్పించారు.
చొక్కా లేని రేణుకాస్వామి తనను కొట్టడం ఆపమని నిందితుడిని వేడుకున్నట్లు చూపిస్తున్న ఫుటేజీ, నటీ పవిత్ర గౌడ దాడిచేసినప్పుడు పాదరక్షల గుర్తులు, వాటికి అంటుకున్న బాధితుడి రక్తపు జాడలు కూడా పోలీసులు కనుగొన్నారు. అదనంగా, దర్శన్ పబ్ నుంచి బయలుదేరడం, రాజరాజేశ్వరి నగర్ ప్రాంతంలోని ఒక షెడ్‌కు వెళ్లడం, రేణుకాస్వామిపై దాడి చేసిన తర్వాత పబ్‌కు తిరిగి రావడం ఫుటేజీలో రికార్డు అయింది.
ఈ సంఘటన తర్వాత, దర్శన్ తన రాబోయే చిత్రం "డెవిల్" షూటింగ్ కోసం మైసూర్ వెళ్లాడు. ఈ కేసును ఛేదించిన బెంగళూరు పోలీసుల బృందం మైసూరులోని ఓ హోటల్‌లో అతడిని అరెస్టు చేసింది. నటుడు అరెస్టును ప్రతిఘటించినప్పటికీ, అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు నివేదికలు తెలిపాయి.
నిందితుడు
చార్జిషీట్‌లో పవిత్ర గౌడను ఏ-1గా, దర్శన్‌ను ఏ-2గా పేర్కొన్నారు. హత్య కేసులో మరో 14 మందిపై అభియోగాలు ఉన్నాయి. వీరంత హత్య, అపహరణ వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. కార్తీక్ అలియాస్ కప్పే, కేశవమూర్తి, నిఖిల్ నాయక్‌లపై సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు అభియోగాలు మోపారు.
బాధితురాలు రేణుస్వామి, దర్శన్ సహనటి పవిత్ర గౌడకు తన అసభ్యకరమైన చిత్రాలను పంపినట్లు ఆరోపణలు వచ్చాయి, నివేదికల ప్రకారం, రేణుకాస్వామి నటుడికి వీరాభిమాని, దర్శన్ అతని భార్య మధ్య విభేదాలు సృష్టించడానికి పవిత్ర గౌడ కారణం అని రేణుకా స్వామి నిందించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో ఈ హత్య చేశారు.
Read More
Next Story