థరూర్ కాంగ్రెస్ పార్టీకి హ్యండ్ ఇస్తున్నారా?
x

థరూర్ కాంగ్రెస్ పార్టీకి హ్యండ్ ఇస్తున్నారా?

కాంగ్రెస్ నుంచి సీపీఐ(ఎం)కి వెళ్తున్నారని పుకార్లు


కేరళ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత, మాజీ కేంద్రమంత్రి ఎంపీ శశిథరూర్ పార్టీని వీడుతున్నట్లు కొన్ని వార్తలు గుప్పుమన్నాయి. థరూర్ సీపీఐ(ఎం) లో చేరతానే కొన్ని సోషల్ మీడియా పోస్ట్ లు ప్రత్యక్షమయ్యాయి. అయితే వీటిని కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. అవన్నీ పుకార్లేనని కొట్టిపడేస్తున్నారు.

"అవన్నీ ఆధారం లేనివి. మాకున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం శశి థరూర్ అలా చేయరు. CPI(M) ఆయనను సంప్రదిస్తున్నట్లు నాకు తెలీదు. నేను ఇప్పుడే టీవీ ఛానెళ్లలో చూశాను.
కాంగ్రెస్‌ పార్టీ ఆయనను బీజేపీ(BJP) మనిషిగా చిత్రీకరిస్తున్నప్పుడు సీపీఎం ఆయనను ఎలా సంప్రదిస్తుంది?" అని కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఒకరు ది ఫెడరల్‌తో అన్నారు. శశిథరూర్ సీపీఐ(ఎం)లో చేరేందుకు దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త మధ్యవర్తిగా వ్యవహరించినట్లు సమాచారం.
ఆయన సీపీఐ(ఎం)తో చర్చించినట్లు సోషల్ మీడియా ప్రచారం జరుగుతోంది. అయితే ఎక్కడా కూడా ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు.
‘దుబాయ్‌కి వెళ్లడంతోనే..’
కేరళ ఎన్నికలకు సంబంధించి ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్‌ ఏర్పాటు చేసిన సమావేశానికి థరూర్ హజరుకాలేదు. ఇదే సమయంలో థరూర్ కేరళ లిటరేచర్ ఫెస్టివల్ (కెఎల్‌ఎఫ్)కు హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో ఆయనపై ఊహగానాలు తీవ్రమయ్యాయి. ఆ తర్వాత దుబాయ్‌కు వెళ్లి పోయారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మార్పుపై వార్తలు బయటకు వచ్చాయి. మంగళవారం జరగనున్న రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశానికి కూడా ఆయన హాజరు కాకపోవచ్చు.
అవన్నీ మీడియా పుకార్లు..
గత నాలుగు రోజులుగా KLFలో థరూర్ చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉంటానని ప్రకటించారు. "KLFకు ముందుగా అనుకున్నట్లు హాజరుకావాల్సి ఉండడంతో హైకమాండ్ సమావేశానికి హాజరు కాలేకపోయాయని వివరణ ఇచ్చారు.
ఈ విషయాన్ని కూడా పార్టీ నాయకత్వానికి ముందుగానే తెలియజేసానని పేర్కొన్నారు. నేను ఏం చెప్పాలనుకున్నా నేరుగా అధిష్టానంతోనే మాట్లాడతానని, నేను మీడియా ముందు నా అభిప్రాయాలను వ్యక్తం చేయను" అని థరూర్ ఇప్పటికే తెలిపారు.
‘అంతర్గతంగా పరిష్కారమవుతాయి.’
‘‘ఊహాగానాలకు హద్దు లేదు. అంతర్గతంగా ఏవైనా సమస్యలుంటే పరిష్కారమవుతాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. "రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా శశి థరూర్‌కు ఫోన్ చేస్తారు.
విషయాలు సామరస్యంగా పరిష్కారమవుతాయి. పార్టీ ఫిరాయింపు ప్రశ్నే లేదు" అని కాంగ్రెస్ సీనియర్ నాయకత్వంలోని ఒక వర్గం ది ఫెడరల్‌తో అంది.
రాహుల్‌తో థరూర్‌కు విభేదాలు?
కేరళలో ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ వ్యూహాలు, పొత్తులపై చర్చించేందుకు నిన్న (జనవరి 23)న పార్టీ ఢిల్లీలో కీలక సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ సమావేశానికి థరూర్ హాజరుకాలేదు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పట్ల ఉన్న అసంతృప్తి కారణంగానే ఆయన సమావేశానికి హాజరుకాలేదని వార్తలొచ్చాయి.
కొచ్చిలో జరిగిన కార్యక్రమంలో థరూర్ పేరును రాహుల్ ప్రస్తావించలేదని అందుకు మీటింగ్‌కు థరూర్ హాజరకాలేదని పార్టీ కార్యకర్త ఒకరు ది ఫెడరల్‌తో అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విజేతలను సత్కరించడానికి జరిగిన 'మహా పంచాయతీ' కార్యక్రమానికి మాత్రం థరూర్ హాజరయ్యారు.
Read More
Next Story