
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య
‘‘మా కుల గణన కేంద్రం చేసే దానికంటే భిన్నం’’
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
కేంద్రం నిర్వహించే కులగణన, కర్ణాటక నిర్వహించే కులగణనకు భిన్నంగా ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. రాష్ట్రం సామాజిక న్యాయం అనే కోణంలో కులగణన చేస్తుందని నొక్కి చెప్పారు.
దేశవ్యాప్తంగా కులగణన మార్చి 1, 2027 లో ప్రారంభం అవుతుందని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం చేసే సర్వేలో కేంద్రపాలిత ప్రాంతం లఢక్, జమ్మూకాశ్మీర్ తో పాటు ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ లో మాత్రం అక్టోబర్ 1, 2026 నుంచి ప్రారంభమవుతున్నాయని నోటిఫికేషన్ లో పేర్కొంది.
‘‘కేంద్రం కులగణన చేస్తోంది. ఇది 2027 నుంచి చేపట్టబోతోంది. అయితే సామాజిక విద్యా సర్వే చేస్తామని చెప్పలేదు. మేము చేయబోయేది సామాజిక విద్యా సర్వే కుల గణన దాని ఫరిదిలోకి వస్తుంది’’ అని సిద్దరామయ్య ఇక్కడ విలేకరులతో అన్నారు.
కేంద్రం జనాభా గణన కర్ణాటక ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని ఆయన పునరుద్ఘాటించారు. అయితే రాష్ట్ర పరిధి, ఉద్దేశ్యాన్ని ఆయన చెప్పుకున్నారు.
‘‘కేంద్రం కులగణన మాత్రమే చేస్తోంది. మేము సమగ్ర సామాజిక విద్యా కుల సర్వేను నిర్వహిస్తున్నాయి. రెండింటి మధ్య వ్యత్యాసం ముఖ్యం. ’’ వెనకబడిన, అణగారిన వర్గాలకు సమర్థవంతమైన సంక్షేమ చర్యలను తెలియజేయగల డేటాను సేకరించడం మా సర్వే ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఆధిపత్య వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు రెండో సర్వే చేస్తున్నారనే ప్రశ్నలను ఆయన తోసిపుచ్చారు. అన్ని వర్గాలు రెండోసారి సర్వేను చేపట్టాలని కోరాయని అన్నారు.
‘‘సర్వే వివరాలు సేకరించి పది సంవత్సరాలు అయింది. కర్ణాటక రాష్ట్ర వెనకబడిన తరతుల కమిషన్ చట్టంలోని సెక్షన్ 11 ప్రకారం ప్రతి పది సంవత్సరాలకు ఒక కొత్త నివేదిక తయారు చేయాలి. కొత్త సర్వేకు ఆదేశించాలనే మా నిర్ణయానికి చట్టపరమైన సెక్షన్లే కారణం ’’ అని ఆయన అన్నారు.
కర్ణాటక రాష్ట్ర వెనకబడిన తరగతుల కమిషన్ సర్వే పనులను వెంటనే ప్రారంభించాలని తాను ఇప్పటికే ఆదేశించానని సిద్దరామయ్య అన్నారు. ‘‘వెనకబడిన తరగతుల కమిషన్ వెంటనే చేయాలని నేను ఇప్పటికే ఆదేశించాను’’ అని ఆయన అన్నారు.
కులగణన ఆధారిత గణన, విధాన రూపకల్పనపై దాని ప్రభావాల చుట్టూ జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కర్ణాటక 2015 లో సామాజిక ఆర్థిక, కుల గణన చేపట్టింది. కానీ వివిధ వర్గాల నుంచి వచ్చిన వివాదం వ్యతిరేకత కారణంగా దాని ఫలితాలు అధికారికంగా ప్రచురించలేదు. జూన్ 12న రాష్ట్ర మంత్రివర్గం తాజా డేటాను సేకరించే లక్ష్యంతో కొత్త సర్వేను నిర్వహించాలని నిర్ణయించింది.
కాంగ్రెస్ హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కులాల పున: గణనకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 2015 డేటా సేకరణ ఆధారంగా ప్రభుత్వానికి సమర్పించిన సామాజిక- విద్యా సర్వే ఫలితాలను మంత్రివర్గం ఇప్పటికే సమీక్షిస్తున్న సమయంలోఈ ప్రకటన వచ్చింది.
Next Story