కేసీఆర్ విచారణ పూర్తి..
x

కేసీఆర్ విచారణ పూర్తి..

50 నిమిషాలు కొనసాగిన కాళేశ్వరం కమిషన్ విచారణ.


కాళేశ్వరం ప్రాజెక్ట్‌లు అవకతవకల అంశంలో కేసీఆర్ ఈరోజు విచారణకు హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రిని పీసీ ఘోష్ విచారించారు. 50 నిమిషాల్లో కేసీఆర్ విచారణ ముగిసింది. కేసీఆర్ తనతో తెచ్చిన ఫైళ్లను కమిషన్‌కు సమర్పించినట్లు సమాచారం. అదే విధంగా కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చారని తెలుస్తోంది. ఈటల, హరీష్ రావులను అడిగిన ప్రశ్నలనే కమిషన్ అడగగా.. అన్నింటికీ తాను అందించిన నివేదికల్లో సమాధానాలు ఉన్నాయని కేసీఆర్ చెప్పినట్లు సంబంధిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అవికాకుండా మరిన్ని ప్రశ్నలను కమిషన్ అడగగా అన్నింటికీ బదులిచ్చినట్లు సమాచారం.

Read More
Next Story