పెట్రోల్ బంక్‌లో పేలుడు.. పరుగులు తీసిన ప్రజలు
x
Revanth reddy, one live

పెట్రోల్ బంక్‌లో పేలుడు.. పరుగులు తీసిన ప్రజలు

fire aacckident, Revanth


హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్టేషన్ పరిధిలో భారీ పేలుడు సంభవించింది. అత్తాపూర్ పెట్రోల్ బంక్‌ను మంటలు కమ్మేశాయి. దీంతో ప్రజలంతా భయబ్రాంతులకు గురై పరుగులు పెట్టారు. పెట్రోల్ బంక్‌‌లో ఏదో వెల్డింగ్ వర్క్ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఓ బండికి పెట్రోల్ కొడుతున్న సమయంలో ఓ నిప్పురవ్వ ఎగిరి పింది. అంతే ఒక్కసారిగా మంటలు పెట్రోల్ బంక్‌ను చుట్టుముట్టేశాయి. ఈ మేరకు సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో గాయాలపాలైన ఇద్దరు వ్యక్తులను ఆసుపత్రికి తరించారు . వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు సంభవించడంతో చుట్టు ప్రక్కల ఉన్నవారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

కాగా ఈ ఘటనపై అనేక అనుమనాాలు రేకెత్తుతున్నాయి. అసలు ఇది మానవ తప్పిదం, వారి నిర్లక్ష్యం వల్ల జరిగిందా? అన్న విషయంపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పెట్రోల్ బంక్‌లో సేఫ్టీ ప్రమాణాలు పాటించకుండా వెల్డింగ్ ఎలా చేశారు? ఎలా చేయించారు? అన్న అంశాలపై విచారణ సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read More
Next Story