
నిజామాబాద్ చేరుకున్న అమిత్ షా
జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంబోత్సవం సందర్బంగా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైద్రాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర నేతలు ఆయనను రిసీవ్ చేసుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచే నేరుగా నిజామాబాద్ పసుపు బోర్డు కార్యాలయానికి అమిత్ షా హెలికాప్టర్ లో బయలు దేరారు.
అక్కడ జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం కంఠేశ్వర్ బైపాస్ చేరుకుని అక్కడ మాజీ మంత్రి డి. శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరుగనున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.
Next Story