
తనపై హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యే శ్రీగణేష్
విలేకరులకు వెల్లడి
తనపై జరిగిన దాడి యత్నం ఘటనపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ స్పందించారు. కొంతమంది రౌడీషీటర్ల నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఎమ్మెల్యే పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చారు. తనపై దాడి చేసేందుకు కుట్ర పన్నారని తెలిపారు. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని శ్రీగణేష్ చెప్పారు.
తనపై దాడి చేయడానికి కొంతమంది యువకులు యత్నించినట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ ఆదివారం ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఓయూ సమీపంలోని వడ్డెర బస్తీలో బోనాల సందర్భంగా ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణలో శ్రీ గణేష్ పై దాడి జరిగింది. ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి వెళ్తుండగా దాదాపు 50 నుంచి 60 మంది దుండగులు ఎదురుగా వచ్చారని ఆయన చెప్పారు. సుమారు 20 బైక్లపై వచ్చి తన వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. తనను కారులోంచి కిందకి దిగాలని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే.
గత ఎన్నికల్లో శ్రీ గణేష్ కు కంటోన్మెంట్ అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడంతోకాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యే అయ్యారు. బిజెపి శ్రేణులు దాడి చేశాయా స్వంత పార్టీకి చెందిన వారు దాడి చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.