ఎన్నికల బహిష్కరణకు బీసీ సంఘాల వార్నింగ్
x
BC Associations meeting on 42% reservations

ఎన్నికల బహిష్కరణకు బీసీ సంఘాల వార్నింగ్

స్ధానికసంస్ధల ఎన్నికల్లో రిజర్వేషన్ కు సంబంధించి బీసీ సంఘాలు ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చాయి


స్ధానికసంస్ధల ఎన్నికల్లో రిజర్వేషన్ కు సంబంధించి బీసీ సంఘాలు ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చాయి. తొందరలో జరగబోతున్న స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేసి తీరాల్సిందే అని డిమాండ్ చేశాయి. తెలంగాణ బీసీలకు చెందిన 90 కులాల నేతలు మొదటిసారి సమావేశమయ్యారు. అదికూడా పార్టీరహితంగా నేతలు హాజరయ్యారు. మామూలుగా బీసీ సంఘాలు ఎప్పుడు సమావేశం పెట్టుకున్నా ఏదో మొక్కుబడిగా కొన్ని సంఘాలు హాజరవుతుంటాయంతే. అలాంటిది మొదటిసారి 90 సంఘాల నేతలు సమావేశం అవ్వటమే రిజర్వేషన్ల(BC Reservations) అంశాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నాయనే విషయాన్ని చెబుతోంది. బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అధ్యక్షతన సమావేశం జరిగింది.

ప్రభుత్వం ఈమధ్యనే నిర్వహించిన కులగణనలో బీసీల జనాభా 56 శాతం ఉన్నట్లు తేలిన విషయాన్ని సమావేశం ప్రభుత్వానికి గుర్తుచేసింది. కాబట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేయటం అన్నది రాజ్యంగబద్ధంగానే జరగాలని సమవేశం డిమాండ్ చేసింది. బీసీ సామాజికవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎంఎల్ఏ ఈ విషయమై ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 42 శాతం రిజర్వేషన్లు సాధించాలని సమావేశం డిమాండ్ చేసింది.

ఇదే సమావేశం మూడు తీర్మానాలను చేసింది. అవేమిటంటే రాష్ట్రపతి దగ్గర పెండింగులో ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లులపై వెంటనే నిర్ణయం వచ్చేలా గవర్నర్ ఆఫీసు చర్యలు తీసుకోవాలి. రెండోది రాష్ట్రప్రభుత్వం కమిషన్ నివేదికలు, గణాంకాలు సిద్ధంచేసి 42 శాతం రిజర్వేషన్ల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలి. మూడో తీర్మానం ఏమిటంటే ప్రభుత్వ నిర్లక్ష్యం కొనసాగితే బీసీ సంఘాలు మండల, జిల్లా స్ధాయిల్లో నిరసన కార్యక్రమాలు, నిర్బంధాలు ప్రారంభించాలని. చివరగా ఎన్నికల బహిష్కరణ విషయాన్ని కూడా ఆలోచించాలని సమావేశం తీర్మానించింది.

Read More
Next Story