ప్రారంభమైన భారత్ సమ్మిట్..
x

ప్రారంభమైన భారత్ సమ్మిట్..

100కుపైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. పెట్టుబడులు, న్యాయం, ప్రపంచశాంతి, అహింస వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు.


హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ ఈరోజు అట్టహాసంగా ప్రారంభమైంది. పెట్టుబడులు, న్యాయం, ప్రపంచశాంతి, అహింస వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. హైటెక్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌, నోవాటెల్‌లో రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు 100కుపైగా దేశాల నుంచి 450 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. వారందరికీ కూడా తెలంగాణ ప్రతినిధులు స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు సాంప్రదాయబద్ధమైన బోనాలు, డప్పు చప్పుళ్లతో వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను తెలియజేసే ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్ సందర్శకులకు రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలపై సమగ్ర అవగాహన కల్పించనుంది. ఈ సమ్మిట్‌లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ కూడా పాల్గొననున్నారు.ఏఐసీసీ అగ్రనేలు పలువురు కూడా ఇందులో పాల్గొననున్నారు. పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయ స్థాయిలో న్యాయం, శాంతిని నెలకొల్పడం, అహింసా మార్గాన్ని ప్రోత్సహించడం ఈ సమ్మిట్ యొక్క ప్రధానఉద్దేశం. రెండు రోజుల్లో వివిధ దేశాల ప్రతినిధులు పెట్టుబడుల అవకాశాలు, అంతర్జాతీయ సంబంధాలు, శాంతి స్థాపన వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చలు జరపనున్నారు.

Read More
Next Story