
అమ్మ బైలెల్లి నాదో
తెలంగాణలో ప్రారంభమైన బోనాలు
నెల రోజుల పాటు జరిగే బోనాలు ఉత్సవాలు గురువారం నుంచి తెలంగాణలో ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబికా దేవాలయంలో కొలువు తీరిన అమ్మవారికి బంగారు బోనంతో తెలంగాణలో బోనాలు వేడుకలు ప్రారంభమయ్యాయి. పసుపు, కుంకుమ, పువ్వులతో ఆలయాన్ని అలంకరించారు. తెలంగాణలోప్రతిష్టాత్మక పండుగ ఈ రోజు నుంచి ప్రారంభం కావడంతో పాతబస్తీలో జోష్ వాతావరణం నెలకొంది. మొదటి బోనంతో బోనాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటలోనే చివరి బోనంతో బోనాల వేడుకలు ముగుస్తాయి. నెల రోజుల పాటు ప్రతీ గురువారం, ఆదివారం తొమ్మిది పూజలు జరగడం ఆనవాయితీగా వస్తోంది.
బంజారీ దర్వాజా వద్ద పటేల్ అమ్మ ఇంట్లో నుంచి సర్కారీ బోనం ప్రారవభమైంది. రిసాలా బజార్ సాయిబాబ ఇంట్లో నుంచి బంగారు బోనం బయలు దేరింది. బంగారు బోనంను దర్శించుకోవడానికి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి కవిత చేరుకున్నారు.
హైద్రాబాద్ లో ఆషాడ మాసం నుంచి బోనాల సందడి ప్రారంభమైంది. మిగతా జిల్లాల్లో శ్రావణ మాసంలో జరుగుతాయి.
కాకతీయుల కాలం నుంచి
కాకతీయుల కాలం నుంచి బోనాలు వేడుకలు గోల్కొండ కోటలో జరిగేవి. 600 ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం ఉంది. కాకతీయుల కాలంలో ప్రారంభమైన ఈ సంప్రదాయాన్ని కుతుబ్ షాహిల కాలంలో కొనసాగింది.
గోల్కొండ నవాబుల కాలం నుంచి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
మత సామరరస్యానికి ప్రతీక
కుతుబ్ షాహి కాలంలో అబ్దుల్ హసన్ తానీషా బోనాలు వేడుకలను ప్రోత్సహించారని ప్రతీతి. ఆయన హాయంలో మత సామరస్యం పెల్లుబికింది. అక్కన్న, మాదన్నలకు మంత్రి పదవులు ఇచ్చారు. అక్కన్న, మాదన్నలు ప్రతీ రోజు శాలిబండలో అమ్మవారికి పూజలు చేసి కోటకు వచ్చేవారు. ఈ కారణంగా ఆ దేవాలయానికి అక్కన్న మాదన్న దేవాలయం అనే పేరు వచ్చింది.
జులై 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో, 21 వ తేదీన పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహినీ దేవాలయంలో వేడుకలు జరుగనున్నాయి.
తెలంగాణలో గత బిఆర్ఎస్ ప్రభుతం నుంచి బోనాలు రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.