కొడుకులను కడతేరుస్తున్న తండ్రులు
x

కొడుకులను కడతేరుస్తున్న తండ్రులు

మంట గలుస్తున్న మానవ విలువలు


పిల్లి తన పిల్లలను తనే తినేస్తుంది. పాములు కూడా తన పిల్లలను తనే తినేస్తాయి. ఈ కోవలో మనుషులు చేరారు. తమ పిల్లలను తల్లిదండ్రులు హత్యలు చేయడం రివాజుగా మారింది. తెలంగాణ నిజామాబాద్ జిల్లాలో కన్న కొడుకును తండ్రి హత్య చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన ఈ కేసు మానవ విలువలు ఎలా మంటగలుస్తున్నాయో సూచిస్తుంది. కొడుకును చంపే తండ్రుల ఘటనలు ఇటీవలికాలంలో ఎక్కువయ్యాయి. ఇది ఒక విషాదకర వార్త. తండ్రులకు కోపం వస్తే కొడుకులు మృత్యువును చూడాల్సిందేనని నిరూపించుకుంటున్నారు. ఈ యేడు జనవరి మాసంలో తూప్రాన్ మనోహరాబాద్ లో మద్యానికి బానిస అయిన తండ్రి కన్న కొడుకు కడతేర్చాడు.

కామారెడ్డిలో తండ్రి అంటే రక్షకుడు. రక్షించాల్సిన తండ్రి కొడుకు చావుకు కారణమయ్యాడు. కామారెడ్డి జిల్లాలో ఓ తండ్రి కన్న బిడ్డనే హత్య చేసి పరారయ్యాడు. కన్న బిడ్డను హత్య చేయడానికి గల కారణం కుటుంబ కలహాలే కారణమని తేలింది. నాలుగేళ్ల కుమారుడు అత్యంత పాశవికంగా హత్య చేయడం తెలంగాణలో సంచలనమైంది. కొడుకు ఊపిరి ఆడకుండా చేసి హత్యచేయడం వెనక భార్యా, భర్తల గొడవే కారణం.

కామారెడ్డి జిల్లాకు నాగిరెడ్డి పేట మండలం పోచారం గ్రామానికి చెందిన అనిల్ అదే గ్రామానికి చెందిన అక్షిత తో ఐదేళ్ల క్రితం పెళ్లయ్యింది. పెళ్లి అయినప్పుడు భార్య భర్తలు అన్యోన్యంగా ఉన్నారు. ఇద్దరు సంతానం కలిగారు. కుమార్తె వయసు ఏడునెలలు. కొడుకు శశాంక్ నాలుగేళ్లు. మొదటి సంతానం కావడంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు రాను రాను ఇద్దరి మధ్య విభేధాలు తారా స్థాయికి చేరిపోయాయి. గొడవలు ప్రారంభమయ్యాయి. భార్యను ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు అనీల్. తీవ్ర గాయాలకు గురైన అక్షిత పుట్టింటికి వెళతానని మారం చేసింది. భార్యను తల్లిదండ్రుల వద్దే దించేసిన భర్త అనిల్ వెనక్కి తిరిగి చూడకుండా కోపంతో తన ఇంటికి వెళ్లిపోయాడు. భార్య భర్తల గొడవకు కొడుకు శ్రావణ్ అని అనీల్ గట్టిగా నమ్మాడు. విచక్షణ మరచి కొడుకు ముక్కు , నోరు మూసేసి ఊపిరాడకుండా చంపేశాడు. విషయాన్ని పసిగట్టిన అనీల్ కుటుంబ సభ్యులు శ్రావణ్ ని విడపించి దగ్గర్లోని నాగిరెడ్డి పేట ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శ్రావణ్ చనిపోయాడు. అనీల్ కోసం పోలీసులు గాలిఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడలో ఈ యేడు మార్చిలో తండ్రి కొడుకులను చంపేశాడు. తక్కువ మార్కులు వచ్చాయన్న సాకుతో కొడుకులిద్దరినీ చంపేశాడు.

తెలంగాణ జయశంకర్ భూ పాలపల్లి జిల్లాలో కన్న కొడుకును తండ్రి రోకలితో కొట్టి చంపాడు. ఇది కూడా ఈ యేడు ఏప్రిల్ మాసంలో జరిగింది. కర్నాటకలో నిరుడు ఓ తండ్రి కొడుకును బ్యాట్ తో కొట్టి చంపాడు. కొడుకు చేసిన నేరం మాత్రం సెల్ ఫోన్ ఎక్కువ సేపు చూడటమే. కొడుకులను సన్మార్గంలో పెట్టాల్సిన తండ్రులే యమ భటులుగా మారుతున్నారు. కలికాలంలో కొడుకులను చంపుతున్న తండ్రులే ఎక్కువగా ఉంటున్నారు. సమాజం ఎటువైపు వెళుతుందో సూచించే ఈ కేసులు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తున్నాయి.

మానసిక సమస్యలే కారణం

తండ్రులు తమ పిల్లలను చంపడానికి మానసిక రుగ్మతలేనని సైక్రియాట్రిస్ట్ లు తేల్చేశారు. కుటుంబ కలహాలు వారిని తీవ్ర వత్తిడికి గురి చేస్తున్నాయి. ఒత్తిడి ఎక్కువై పిల్లలను హత్యలు చేస్తున్నారు. పలు సర్వేలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి.
మంచి జరుగుతున్న భ్రమే కారణం: సైకాలజిస్ట్

ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు తమ స్వంత పిల్లలను హత్య చేయడం లాంటి దుర్మార్గమైన ఘటనలు కొన్ని చోట్ల జరుగుతున్నాయి. ఇవి మానవతా విలువల పతనానికి సంకేతంగా కనిపిస్తున్నప్పటికీ, దీని వెనక ఉన్న సైకాలజికల్ (మనోవైజ్ఞానిక) కోణాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. కొందరు తల్లిదండ్రులు తీవ్రమైన సైకోటిక్ డిజార్డర్స్ (Psychotic Disorders) లో బాధపడుతుంటారు. వారు వాస్తవాన్ని గుర్తించలేరు. కొందరికి "పిల్లలను చంపితే వారికి మంచి జరుగుతుంది" అనే భ్రాంతులు కలుగుతాయి.

ఆత్మహత్య చేసుకోవాలనుకునే తల్లిదండ్రులు – పిల్లలను కూడా చంపాలి అనే తప్పుడు భావన కలిగి ఉండొచ్చు.ఇది "తాము లేకపోతే పిల్లలు ఎందుకు బతకాలి? అనే కోణంలో విపరీత నిర్ణయాలు తీసుకుంటారు. మరి కొందరు తల్లిదండ్రులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నపుడు – ఉద్యోగం పోవడం, అప్పులు, వైవాహిక కలహాలు మొదలైనవి – వారిలో మానసిక అస్థిరత పెరుగుతుంది. తమ పిల్లల భవిష్యత్తు గురించి అధిక ఆందోళన ఉంటే, వారు దానిని పరిష్కరించలేక Impulse నిర్ణయాలు తీసుకోవచ్చు.

డాక్టర్. బి.వి.కేశవులు . ఎండి. సీనియర్ న్యూరో సైకియాట్రిస్ట్

కొందరు తల్లిదండ్రులు నార్సిసిస్టిక్ (తాము గొప్పవారనే భావన), బార్డర్లైన్ (ఎక్కువ భావోద్వేగ మార్పులు), లేదా యాంటీసోషియల్ పర్సనాలిటీస్ లో బాధపడుతుంటారు.వారు పిల్లలను "వస్తువుల"లా చూస్తారు – స్వార్థం కోసం వారి ప్రాణాలను త్యాగం చేస్తుంటారు.తల్లిదండ్రులూ చిన్నప్పట్లో వేధింపులకు గురై ఉంటే, వారు అదే పద్ధతిని పిల్లలపై చూపించవచ్చు.మనదేశంలో మనోవైజ్ఞానిక సహాయం తీసుకోవడం అంటే కళంకం (stigma) గా భావిస్తారు.దీని వల్ల చికిత్స అవసరమైన వారు బయటకు చెప్పరు, చివరికి దారుణ నిర్ణయాలు తీసుకుంటారు.

ఈ సంఘటనలు మానవతా విలువలు మసకబారిన సంకేతాలు మాత్రమే కాదు, సమాజం యొక్క మానసిక ఆరోగ్య పరిస్థితి గురించి హెచ్చరికలు కూడా. పిల్లలు మన భవిష్యత్తు – మనం వారిని సంరక్షించకపోతే, అది మన భవిష్యత్తుపై హింసచేసే చర్య అవుతుంది. ఈ సమస్యలను మెంటల్ హెల్త్ అవగాహన, హెల్ప్‌లైన్లు, కౌన్సిలింగ్ సేవల ద్వారా చాలా వరకు నియంత్రించవచ్చు

Read More
Next Story