జైలులో కవితను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు
x

జైలులో కవితను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో భారీ షాక్ తగిలింది. ఈడీ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆమెను గురువారం సీబీఐ అరెస్ట్ చేసింది.


ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో భారీ షాక్ తగిలింది. ఈడీ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆమెను గురువారం సీబీఐ అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసులో కవితను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 6న ఆమెను జైలులో ప్రశ్నించిన సీబీఐ తాజాగా అదుపులోకి తీసుకుంది. కవితను జ్యుడీషీయల్ కస్టడీ నుంచి సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు తరలించనున్నారు. గతంలో కవితను విచారించిన సమయంలో నమోదు చేసిన స్టేట్‌మెంట్, అప్రూవర్లతో పాటు ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమెను ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమవుతోంది.

కవిత రెగ్యులర్ పిటిషన్ పై ఈ నెల 16న విచారణ జరగనున్న నేపథ్యంలో సీబీఐ కస్టడీలోకి తీసుకోవడం సంచలనంగా మారింది. మరోవైపు ఆమె జ్యుడిషియల్ కస్టడీని ఏప్రిల్ 23వరకు పొడిగించారు. కాగా లిక్కర్ కేసులో మార్చి 15న హైదరాబాద్‌లో ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 10 రోజులు ఈడీ కస్టడీలో విచారించగా.. అనంతరం న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో మార్చి 26న కవితను తీహార్ జైలుకు తరలించారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా అరెస్టై తిహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.

కాగా, కవితను సిబిఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత తరపు న్యాయవాదులు రితేష్ రాణా, మోహిత్ రావు రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ స్పెషల్ జడ్జ్ ముందు అప్లికేషన్ దాఖలు చేయగా.. "ఈ కేసు పూర్వాపరాలు నాకు తెలిదు, నావద్ద ఎటువంటి సమాచారం లేదు. నా ఎదుట ఎటువంటి వాదనలు జగరలేదు. నేను ఎలాంటి రీలీఫ్ ను ఇవ్వలేను. ఈ కేసులో నేను జోక్యం చేసుకోలేను. నా ఎదుట కేవలం అత్యవసర అప్లికేషన్ లపై మాత్రమే వాదనలు జరుగుతాయి. ఏప్రిల్ 12 వ తేదీన ఉదయం 10 గంటలకు సంబంధిత కోర్టు న్యాయమూర్తి ముందు సబ్మిట్ చేయాలని సీబీఐ స్పెషల్ జడ్జ్ మనోజ్ కుమార్ తేల్చి చెప్పారు.


Read More
Next Story