
కొత్త మంత్రులు వివేక్, అడ్లూరి, శ్రీహరిలతో గ్రూప్ ఫొటొ
నాటి మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి,మంత్రివర్గంలో వాకిటికి చోటు
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ముగ్గురు ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి,గడ్డం వివేక్ , అడ్లూరి లక్ష్హణరావులకు స్థానం లభించింది.
ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఆదివారం ఎట్టకేలకు జరిగింది. కులాల సమీకరణ ప్రకారం కొత్తగా ముగ్గురు మంత్రులకు కేబినెట్ లో స్థానం లభించింది. ముదిరాజ్ కులానికి చెందిన వాకిటి శ్రీహరి, మాల వర్గానికి చెందిన గడ్డం వివేక్, మాదిగ వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్హణరావులకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు.
మాట నిలబెట్టుకున్న రేవంత్
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాడు సీఎం రేవంత్ ప్రజలకు హామి ఇచ్చారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో 17 సీట్లు ఇవ్వండి, పంద్రాగస్టు తిరిగే లోగా మీ ముదిరాజ్ బిడ్డ వాకిటి శ్రీహరిని మంత్రిని చేసే బాధ్యత నాది’’ అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. పంద్రాగస్టు తిరిగే లోగా ముదిరాజ్ వర్గానికి చెందిన వాకిటి శ్రీహరిని మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి మంత్రిని ఛేశారు.
మక్తల్ సర్పంచ్ నుంచి మంత్రి దాకా...
ముదిరాజ్ వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.2001వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో చేరి మక్తల్ గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. అనంతరం 2014 నుంచి 2018వరకు మక్తల్ జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2014 నుంచి 2018 వరకు నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 2022 సెప్టెంబర్నుంచి నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తూ 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ దక్కడటంతో ఎమ్మెల్యే విజయం సాధించారు. శ్రీహరి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ కు చెందిన చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై 17,525 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.
కాకా తనయుడు గడ్డం వివేక్
కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు గడ్డం వెంకటస్వామి తనయుడైన గడ్డం వివేకానంద్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి 15వ లోక్ సభకు ఎంపీగా విజయం సాధించారు. 2023వ సంవత్సరంలో చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గతంలో కొంతకాలం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో పనిచేసినా, చివరకు తన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వివేక్ అన్న గడ్డం వినోద్ కూడా బెల్లంపల్లి ఎమ్మెల్యేగా, వివేక్ కుమారుడు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే గడ్డం వివేక్ పారిశ్రామిక వేత్తగా ఎదిగారు. ప్రస్థుతం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గడ్డం బ్రదర్స్ లో మంత్రి పదవి కోసం పోటీ పడినా చివరకు వివేక్ కు అమాత్య యోగం లభించింది.
ఎన్ఎస్ యూఐ నుంచి కాంగ్రెస్ పార్టీలో...
జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్హణరావు 1982 వ సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేశారు. 1982 నుంచి 1985 వరకు గోదావరి ఖని జూనియర్ కళాశాల ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడిగా, ఆ తర్వాత కరీంనగర్ జిల్లా ఎన్ఎస్ యూఐ విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1996 నుంచి 2001 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ ప్రధశాన కార్యదర్శిగా వ్యవహరించారు. 2006వ సంవత్సరంలో మొదటి సారి ధర్మారం నియోజకవర్గం నుంచి జడ్పీటీసీగా గెలిచారు. 1999లో అసెంబ్లీ ఎన్నికల్లో మేడారం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2010 నుంచి 2012 వరకు కరీంనగర్ జడ్పీ ఛైర్మన్ గా పనిచేశారు. 2009, 2010లో జరిగి ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటమి చవి చూశారు. 2014, 2018 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. గతంలో ఉమ్మడి రాస్ట్రంలో ఏపీ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేశారు. జగిత్యాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ 2023లో ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పలు సార్లు ఓడిపోయినా ఎట్టకేలకు గెలిచారు.అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ప్రభుత్వం విప్ గా నియమించింది. ఆదివారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
కొత్త మంత్రులకు సీఎం అభినందనలు
తెలంగాణ నూతన మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్న వివేక్ వెంకట స్వామి,అడ్లూరి లక్ష్మణ్,వాకిటి శ్రీహరి లకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.తెలంగాణ శాసన సభ లో ఉప సభాపతి బాధ్యతలు స్వీకరించబోతున్న రామచంద్రు నాయక్ ను సీఎం అభినందించారు.
Next Story