CM Revanth Reddy
x

బీసీ నేతలతో సీఎం రేవంత్..

దేశంలో ఏ సీఎం , ఏ ప్రభుత్వం కుల గణన సాహసం చేయలేదు. కుల గణన చేసిన ఏకైక రాష్ట్రం మనదే.


బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వారి సమస్యలపై ప్రజాభవన్‌లో చర్చిస్తున్నారు. ఇందులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కీలకంగా చర్చించినట్లు సమాచారం. ఇందులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో తొలిసారి కులగణన చేసిన ప్రభుత్వం కాంగ్రెస్‌దేనని చెప్పారు. ‘‘ఆర్టీఐ యాక్ట్ తెచ్చింది కాంగ్రెస్. తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకు రండి కుల గణన చేస్తాము అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదు. తెలంగాణ ఇస్తాము అని ఇచ్చారు. తెలంగాణ లో బలహీన వర్గాలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. మనం ఒక అవకాశం ఇద్దాం అని కాంగ్రెస్ ను గెలిపించారు. ఈ మీటింగ్ లో ఉన్న పీసీసీ చీఫ్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్ లు ఉన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ను అమలు చేశాను. దేశంలో ఏ సీఎం , ఏ ప్రభుత్వం కుల గణన సాహసం చేయలేదు. పారదర్శకంగా కుల గణన చేసాము. సమగ్ర సర్వే గతం లో కేసీఆర్ 12 గంటల్లో చేశారు అని అంటున్నారు. ఆ లెక్కలు ను బయట పెట్టకుండా ఎన్నికల కు ఉపయోగించుకున్నారు. దేశంలో కుల గణన ఎక్కడ చేశారు అధికారులు బృందం ను పంపాము. బీహార్, హర్యానా రాష్ట్రాల కు పంపినం. మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశాము. ఇతర రాష్ట్రాల అనుభవం తో ప్లానింగ్ డేపర్ట్మెంట్ కు ఇచ్చాము వాళ్ల ను నోడల్ ఏజెన్సీ గా అప్పగించాము’’ అని తెలిపారు.

‘‘కులగణన ఎక్స్‌రే లాంటిదని రాహుల్ గాంధీ ఆనాడే చెప్పారు. అన్ని రంగాల్లో బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే కులగణన చేయాల్సిందేనని రాహుల్ గాంధీ గారు స్పష్టం చేశారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే కులగణన చేసి తీరుతామని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో మాట ఇచ్చారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన నిర్వహించాం. మన నాయకుడు ఇచ్చిన మాటను తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి సాహసం చేయలేదు. కానీ తెలంగాణలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం అందరి భాగస్వామ్యంతో కులగణన నిర్వహించాం. సమగ్ర కుటుంబ సర్వే తప్పుల తడకగా ఉందనే.. ఆనాటి ప్రభుత్వం లెక్కలను బయటపెట్టలేదు… అందుకే ఆ వివరాలను ఎన్నికల కోసం వాడుకున్నారు తప్ప..ప్రజల కోసం వినియోగించలేదు’’ అని చెప్పారు.

‘‘కానీ మేం చిత్తశుద్ధితో కులగణనపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాం. చట్టపరంగా ఇబ్బందులు కలగకుండా ప్లానింగ్ డిపార్ట్ మెంట్ కు అప్పగించి కులగణను పకడ్బందీగా నిర్వహించాం. ఇంటింటికి ఎన్యుమరేటర్లను పంపి సమాచారాన్ని సేకరించాం. సేకరించిన సమాచారాన్ని తప్పులు దొర్లకుండా ఎన్యూమరేటర్ సమక్షంలో కంప్యూటరీకరించాం. తప్పులు జరిగాయని మాట్లాడుతున్న వారు ఏ బ్లాక్ లో ఎక్కడ తప్పు జరిగిందో చెప్పాలి. ప్రక్రియను తప్పుబట్టడం ద్వారా మొత్తం వ్యవస్థను కుప్పకూల్చేందుకు కుట్రలు చేస్తున్నారు. ఇది బీసీ సోదరులు గమనించాలి’’ అని కోరారు.

‘‘స్వతంత్ర భారత దేశంలో ఎవ్వరూ ఇప్పటివరకు కులగణన చేపట్టలేదు. ఒక్కసారి బీసీల లెక్క తెలిస్తే వాటా అడుగుతారనే దీనిపై కొందరు కుట్ర చేస్తున్నారు. ఎంతోకాలంగా ఉన్న డిమాండ్ ను మనం విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్నాం. బీజేపీలో ఉన్న ఒకటి రెండు ఆధిపత్య సామాజిక వర్గాలకు నష్టం జరుగుతుందనే వాళ్లు కులగణనపై కుట్రలు చేస్తున్నారు. దేశంలో కులగణన చేపట్టడం ఇష్టంలేకనే బీజేపీ కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కెసిఆర్ సర్వే ప్రకారం బీసీలు 51 శాతం మాత్రమే… కానీ మన కులగణన ప్రకారం 56.33 శాతం.

ఇక బీసీల లెక్క తగ్గిందో పెరిగిందో మీరే చెప్పండి. గుజరాత్ లో ముస్లింలు ఓబీసీ కేటగిరీలో ప్రయోజనం పొందుతున్నారని… తాను ఎప్పుడూ మీడియాలో చెప్పుకోలేదని మోదీ 2023 లో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు’’ అని గుర్తు చేశారు.

‘‘కానీ బండి సంజయ్ రేవంత్ రెడ్డి బీసీలలో ముస్లింలను కలిపారని చెబుతున్నాడు. తప్పుడు మాటలు మాట్లాడటం కాదు.. ఏ బ్లాక్ లో ఏ ఇంట్లో తప్పు జరిగిందో నిరూపించాలని కెసిఆర్, బండి సంజయ్, కిషన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా. భవిష్యత్ లో దేశంలో బీసీ రిజర్వేషన్ల గురించి చర్చించాలంటే తెలంగాణ గురించి, రేవంత్ రెడ్డి గురించి చర్చించుకునే పరిస్థితి ఉంటుంది. ఈ అవకాశాన్ని జారవిడిచుకుంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. నేను రాజకీయ అజ్ఞానంతో మాట్లాడటంలేదు. మా నాయకుడి ఆదేశాలు పాటించే వ్యక్తిగా మాట్లాడుతున్న. నాయకుడి ఆదేశాలను పాటించడమే నా ధర్మం. ఈరోజు మనం చేసిన లెక్క నూటికి నూరు శాతం పక్కా. ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు. మోదీ రాజకీయంగా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందనే ఈ ప్రక్రియను తప్పుబడుతున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉద్యోగాలు పోతాయనే దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది’’ అని పిలుపునిచ్చారు.

‘‘పకడ్బందీ ప్రక్రియతో కులగణన చేశాం…దీన్ని కాపాడుకుని ప్రజల్లోకి తీసుకెళ్లండి. ప్రక్రియ పూర్తి చేయడంతో నా బాధ్యత పూర్తయింది. దీన్ని పట్టాలెక్కించి గమ్యం చేర్చే వరకు ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీదే. బీజేపీకి నేను సవాల్ విసురుతున్నా… మీరు జనగణనలో కులగణన చేర్చండి.. ఎవరి లెక్క తప్పో తేలుతుంది. జనగణనలో కులగణన చేర్చాలని ఈ సమావేశం వేదికగా తీర్మానం చేస్తున్నాం. సామాజికవర్గాలవారీగా సమావేశాలు నిర్వహించి మార్చి 10 లోగా తీర్మానాలు చేయండి. మీ ఐకమత్యాన్ని చాటండి… అప్పుడే మీకు రాజకీయంగా, విద్య ఉద్యోగాల పరంగా ప్రయోజనం ఉంటుంది. బలహీన వర్గాలకు కులగణన నివేదికనే బైబిల్, ఇదే భగవద్గీత, ఇదే ఖురాన్’’ అని వ్యాఖ్యానించారు.

‘‘యూనివర్సిటీ లో మీటింగ్ లు పెట్టాలని కోరుతున్న మేధావులు ను పిలవండి. కుల గణన పై కేసీఆర్ కేటీఆర్ కిషన్ హరీష్ సంజయ్ ఇంత వరకు ఒక్క సలహా ఇవలేదు. కుల గణన హెల్త్ చెకప్ అన్నారు నేను మెగా. హెల్త్ చెక్ అప్ అంటున్న. మిగతా విషయాల్లో నన్ను విభేదించిన ఈ విషయం లో నాకు మద్దతు పలకండి. బీజేపీ కి చిత్తశుద్ధి ఉంటే జన గణన లో కుల గణన లెక్కలు చేయండి అపుడు నా లెక్కలు తప్పు అని చెప్పండి. జన గణన లో కుల గణన చేర్చాలి ఇది తీర్మానం. ఈ లెక్కలు ను అనాథ ను చేయకండి. బీసీ లో 104 కులాలు ఉన్నాయి. వెంటనే మీటింగ్ లు స్టార్ట్ చేయాలి అని అరే కటిక శ్రీనివాస్ ను కోరుతున్న. రజకులు తరుపున ఎమ్మెల్యే విర్ల పల్లి శంకర్ ను కోరుతున్న. కురుమ మీటింగ్ పెట్టాలని ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం ను కోరుతున్న. మోడీ ఒక మాట బండి సంజయ్ ఇంకో మాట చెపుతున్నారు. కేటీఆర్ కిషన్ రెడ్డి కి తోడుగా ఇపుడు బండి సంజయ్ తోడు అయుండు. బలహీన వర్గాలకు మీటింగ్ లకు ఇబ్బంది ఉంటే ఎగ్గే మల్లేశం , నీలం మధు ఆదుకుంటారు’’ అని భరోసా ఇచ్చారు.

Read More
Next Story