అధికారులకు సీఎం అత్యవసర ఆదేశాలు
x

అధికారులకు సీఎం అత్యవసర ఆదేశాలు

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు.


వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు తదితరులతో ఫోన్లో మాట్లాడారు. జిల్లాలో వరద పరిస్థితులపై ఆరా తీశారు.

మరోవైపు అధికారులకు టెలికాన్ఫరెన్స్ లో కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్. భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు సెలవులు రద్దు చేసుకోవాలని ఆదేశించారు. వరద ప్రాంతాల్లో తక్షణ సాయం చర్యలు చేపట్టాలన్నారు. వరదలు, సహాయక చర్యల సమాచారాన్ని సీఎంవోకు పంపాలన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారులకు ఫోన్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు.

అధికారులకు సీఎం ఆదేశాలు ఇవే...

సీఎస్, డీజీపీ, మున్సిపల్, కరెంట్, పంచాయతీ రాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలి కాన్ఫరెన్స్ లో సీఎం ఆదేశం.

జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలి.

అధికారులు సెలవులు పెట్టొద్దని, సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకొని వెంటనే పనుల్లో నిమగ్నం కావాలి.

అత్యవసర విభాగాల అధికారులు క్షేత్ర స్థాయిలో అంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఏంఓ కార్యాలయానికి పంపాలి.

వరద ఎఫెక్ట్ ఏరియాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలి.

అత్యవసర పనుకుంటే తప్పా ప్రజలు బయటకి రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్.

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా అంటూ ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని సూచించిన ముఖ్యమంత్రి రేవంత్.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలి.

24 గంటలు అలెర్ట్ గా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో భాగంగా కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ పిలుపు.

Read More
Next Story