బుద్ధుని సందేశం ఇప్పుడు దేశానికి అవసరమన్న సీఎం
x

బుద్ధుని సందేశం ఇప్పుడు దేశానికి అవసరమన్న సీఎం

సమాజంలో అసహనం, అసూయ పెరిగిపోతున్నాయి. స్పర్థలు, ఉద్వేగాలు పెరిగేలా వాతావరణం నెలకొని ఉంది. బుద్ధుని సందేశం దేశానికి ఇప్పుడు ఎంతో అవసరమని సీఎం రేవంత్ అన్నారు.


బుద్ధ పూర్ణిమ సందర్భంగా గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లోని మహాబోధి బుద్ధ విహార్ ను సందర్శించారు. అక్కడ బుద్ధ పూర్ణిమ వేడుకల్లో పాల్గొన్నారు. సంయుక్త నిఖాయ నాలుగో నిఘంటువును ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గొప్ప క్షేత్రాన్ని సందర్శించిన అనుభూతి కలిగిందన్నారు. గౌతమ బుద్ధుడి బోధనలు అందరికి అవసరమని రేవంత్ రెడ్డి అన్నారు. సమాజంలో అశాంతి, అసూయను అధిగమించాల్సి బాధ్యత అందరిపైనా ఉందని ఆయన అన్నారు.

"రాజ్యం, అధికారం ఉండి వాటిని కాదని 29 ఏళ్ల వయసులో శాంతి కోసం బుద్ధుడు ఆలోచించారు. రెండున్నర వేల సంవత్సరాలుగా బౌద్ధ సిద్ధాంతం నిలబడి ఉంది. ప్రతి పనిని ధ్యానంగా చేయాలన్న సూచనలో చాలా అర్థం ఉంది. ఈ సూక్తి ని నుంచి ఎంతో స్ఫూర్తిని పొందాను. ఏ పని అయినా నేను ఎంతో ధ్యానంగా చేస్తాను" అని సీఎం అన్నారు.

మహాబోధి బుద్ధ విహార్ అభివృద్ధి కోసం ప్రభుత్వం సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ధ్యాన మందిరం కోసం స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేస్తామన్నారు. సమాజంలో అసహనం, అసూయ పెరిగిపోతున్నాయి. స్పర్థలు, ఉద్వేగాలు పెరిగేలా వాతావరణం నెలకొని ఉంది. బుద్ధుని సందేశం దేశానికి ఇప్పుడు ఎంతో అవసరం. సమాజాన్ని శాంతి మార్గంలో నడిపించేందుకు ఓ పాఠశాలను నిర్వహించాలని మహాబోధి బుద్ధ విహార్ నిర్వాహకులకు రేవంత్ రెడ్డి సూచించారు.

బుద్దుని సందేశాన్ని సమాజంలో ప్రతి ఒక్కరికి చేరవేయడానికి అవసరమైన సహాయం వ్యక్తి గా, ప్రభుత్వంగా చేస్తాం. ఈ ప్రభుత్వం మీది... అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయి. తెలంగాణలో బుద్ధ బిక్షులకు తగిన గౌరవం ఉంటుందని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు.

Read More
Next Story