మాజీ సీఎం కేసీఆర్ కి సీఎం రేవంత్ ఆహ్వాన లేఖ
x

మాజీ సీఎం కేసీఆర్ కి సీఎం రేవంత్ ఆహ్వాన లేఖ

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సీఎం రేవంత్ ఆహ్వాన లేఖ రాశారు. ప్రభుత్వ అధికారిక ఉత్సవాలలో పాల్గొనాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు.


తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వాన లేఖ రాశారు. ప్రభుత్వ అధికారిక ఉత్సవాలలో పాల్గొనాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు వ్యక్తిగత ఆహ్వాన లేఖ, ఆహ్వాన పత్రిక ను స్వయంగా కేసీఆర్ కి అందించాలని ప్రోటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్ లకు సీఎం రేవంత్ సూచించారు.

జూన్ 2వ తేదీన ఉదయం 10 గంగలకు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా సీఎం రేవంత్ కేసీఆర్ కి రాసిన ఆహ్వాన లేఖలో పేర్కొన్నారు. కేసీఆర్ ను స్వయంగా కలిసి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వాన పత్రిక అందించేందుకు సిబ్బంది తో చర్చలు జరిపారు. గజ్వేల్ ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఉన్నారని తెలియయడంతో స్వయంగా ఆహ్వాన పత్రిక, లేఖను అందించేందుకు హర్కర వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్ అక్కడికే వెళ్లనున్నారు.

Read More
Next Story