
కాళేశ్వరం కమిషన్కు సీఎంఓ లేఖ..
జూన్ 30లోపు కమిషన్కు కావాల్సిన సమాచారం అంతా అందిస్తామని తెలిపింది.
కాళేశ్వరం అంశంపై అప్పటి కేబినెట్ చర్చించిన అంశాలకు సంబంధించిన సమాచారం కావాలంటూ సీఎంఓకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ లేఖ రాసింది. తాజాగా దీనిపై సీఎంఓ స్పందించింది. జూన్ 30లోపు కమిషన్కు కావాల్సిన సమాచారం అంతా అందిస్తామని తెలిపింది. కమిషన్ అడిగిన సమాచారాన్ని ఆయా ఇరిగేషన్ అండ్ ఫైనాన్స్ శాఖకు సీఎంవో పంపించగా.. ఎల్లుండి కేబినెట్లో కాళేశ్వరం కమిషన్ లేఖపై సర్కార్ చర్చించనుంది. ఇదిలా ఉంటే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ దాదాపు పూర్తయింది. ఇంకా కొంత సమాచారం కోసం కమిషన్ ప్రయత్నిస్తోంది. అది కూడా లభించిన అనంతరం మొత్తం పరిశీలించిన తర్వాత వీలైనంత త్వరగా ప్రభుత్వానికి తన నివేదికను అందించనుంది. ఇప్పటికే ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, ఈటలను కమిషన్ విచారించింది. కాళేశ్వరం నిర్మించిన పలువురు అధికారులను కూడా విచారించింది.