3 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఫిక్స్.. మల్లన్నకి భలే ఛాన్స్
x

3 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఫిక్స్.. మల్లన్నకి భలే ఛాన్స్

ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న సస్పెన్స్ కి తెరపడింది. మిగిలిన మూడు లోక్ సభ స్థానాలకి ఏఐసిసి అభ్యర్థులను ప్రకటించింది.


ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న సస్పెన్స్ కి తెరపడింది. మిగిలిన మూడు లోక్ సభ స్థానాలకి ఏఐసిసి అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం స్థానానికి రామసహాయం రఘురాం రెడ్డి, కరీంనగర్ కి వెలిచాల రాజేందర్‌రావు, హైదారాబాద్ సెగ్మెంట్ కి మహ్మద్ సమీర్‌ లను అభ్యర్థులుగా ఖరారు చేసింది. అలాగే క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్నని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్ణయించింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మల్లన్న పేరును అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ పేరిట అధికారిక ప్రకటన విడుదల అయింది.

Read More
Next Story