ఫాల్కన్ స్కామ్.. రంగంలోకి దిగిన ఈడీ
x

ఫాల్కన్ స్కామ్.. రంగంలోకి దిగిన ఈడీ

22 షెల్ సంస్థల ద్వారా విదేశాలకు పెట్టుబడిదారుల డబ్బును మళ్లించారు. దుబాయ్, మలేషియా, సింగపూర్ లాంటి దేశాలకు డబ్బు చేరిందని గుర్తింపు.


హైదరాబాద్‌లో మరో స్కాం బయటపడింది. పెట్టుబడుల పేరుతో వందల కోట్ల రూపాయల మోసం జరిగింది. ఇదంతా చేసింది ఒకే ఒక సంస్థ.. దాని పేరు ‘ఫాల్కన్’. ఈ సంస్ధ దేశవ్యాప్తంగా పెట్టుబడుల పేరుతో దాదాపు రూ.1700 కోట్లు వసూలు చేసిందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో తాజాగా ఈడీ అడుగుపెట్టింది. ఇప్పటికే కేసు నమోదు చేసిన దర్యాప్తును వేగవంగం చేసింది. ఇప్పటికే ఫాల్కన్ సంస్థ ఛైర్మన్‌కు లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారు పోలీసులు. అనంతరం ఈ కేసును సైబరాబాద్ పోలీసులు.. ఈడీకి సిఫార్సు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తులో వేగం పెంచింది. ఈ పరిణామాలు జరుగుతున్న క్రమంలోనే ఫాల్కన్ సంస్థ ఎండీ అమర్ దీప్ కుమార్ సహా సీఈఓ, సీఓలును దుబాయ్‌కి వెళ్లిపోయారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాలను పోలీసులు అలెర్ట్ చేశారు. కాగా ఈ దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగుచూశాయి.

చిన్నపెడ్డుబడులు పెద్ద కంపెనీల్లో భారీ లాభాలు అంటూ ప్రజలకు ఫాల్కన్ సంస్థ కుచ్చుటోపీ పెట్టింది. ఈ స్కీమ్‌లో భారీ స్కామ్ జరిగిందని పోలీసులు గుర్తించారు. ఈఓడబ్ల్యూ కూడా ఈ కేసుపై పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. ఈ స్కీమ్ ద్వారా ఫాల్కన్ సంస్థ రూ.1700 కోట్లు వసూలు చేయగా.. అందులో కేవలం హైదరాబాద్ నుంచే రూ.850 కోట్లు వసూలు చేసింది. పెట్టుబడి దారుల నుంచి వసూలు చేసిన డబ్బును ఎప్పటికప్పుడు విదేశాలకు తరలించారు. 22 షెల్ సంస్థల ద్వారా విదేశాలకు పెట్టుబడిదారుల డబ్బును మళ్లించారు. దుబాయ్, మలేషియా, సింగపూర్ లాంటి దేశాలకు డబ్బు చేరింది. కేసు నమోదు అవుతూనే ఫాల్కన్ సంస్థ ఛైర్మన్ అమర్ దీప్.. దుబాయ్ వెళ్లిపోయారాని ఈడీ గుర్తించింది. ఇప్పుడు వారిని పట్టుకోవడానికి, తిరిగి ఇండియాకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

Read More
Next Story