
ముగిసిన ఈటల రాజేందర్ విచారణ..
బ్యారేజీల నిర్మాణ సమయంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్.
మాజీ మంత్రి, ప్రస్తుతం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ను కాళేశ్వరం కమిషన్ ఈరోజు విచారించింది. ఆయన విచారణ దాదాపు మూడు గంటలకు కొనసాగినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్ట్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో అవకతవకలపై న్యాయ విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఈటల హాజరయ్యారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు. బ్యారేజీల నిర్మాణ సమయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈటల ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే ఆయనను కూడా పీసీ ఘోష్ కమిషన్ విచారణకు పిలిచింది. బ్యారేజీల నిర్మాణం కోసం ఎప్పుడు ఎన్ని నిధులు విడుదల చేశారు, ఎంత ఖర్చు చేశారు. ఎన్ని బిల్లులపై ఆయన సంతకాలు చేశారు. ఇలా అనేక అంశాలపై అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ నెల 9న మాజీ మంత్రి హరీష్ రావు, 11న కేసీఆర్ను కూడా ఈ కమిషన్ విచారించనుంది.