కేటీఆర్‌పై అట్రాసిటీ కేసు పెట్టండి : కాంగ్రెస్ వినతి
x

కేటీఆర్‌పై అట్రాసిటీ కేసు పెట్టండి : కాంగ్రెస్ వినతి

కేటీఆర్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రతినిధుల బృందం అదనపు డీజీపీ మహేష్ భగవత్ ను కలిసి ఫిర్యాదు చేసింది.


కేటీఆర్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ ను కలిసి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం చుట్టూ జీహెచ్ఎంసి సుందరీకరణ పనులు చేపట్టగా, అంబేద్కర్ కు అడ్డుగా కూడా అంటూ నమస్తే తెలంగాణ పేపర్లో,కేటీఆర్ ప్రోద్బలంతో నడిచే సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ల ద్వారా అబద్దాలు, తప్పుడు రాతలు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

- ప్రజలను రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలా కేటీఆర్ కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన అనుచరుల ద్వారా కుట్రను సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారని.. అంబేద్కర్ విగ్రహం చుట్టూ సుందరీకరణ కోసం కట్టిన గోడను బీఆర్ఎస్ నాయకులు కూల్చి వేశారు, ఈ చర్య దళితుల యొక్క ఆత్మాభిమానo దెబ్బతీస్తుందని కాంగ్రెస్ నేతలు చెప్పారు.
రాజ్యాంగ నిర్మాత కు జరిగిన ఈ అవమానం భారత పౌరులందరిని కలిచి వేసిందని,ఇలాంటి చర్యలను ఖండిస్తూన్నామని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు చేయకుండా ఉండడానికి సరైన బుద్ధి చెప్పే విధంగా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేటీఆర్, కృశాంక్ పిఏ తిరుపతి, ఇతర బీఆర్ఎస్ నాయకుల పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు కోరారు. ఎస్సీ సెల్ అధ్యక్షులు నగరిగారి ప్రీతం నేతృత్వంలో తెలంగాణ ఖనిజ వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఇరవర్తి అనిల్, ముత్స్య కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి, పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి డా. కొనగాల మహేష్ లు అదనపు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.


Read More
Next Story