షాద్ నగర్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
x

షాద్ నగర్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

హైదరాబాద్ శివార్లలోని షాద్ నగర్ లో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక ఇండస్ట్రియల్ ఏరియాలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.


హైదరాబాద్ శివార్లలోని షాద్ నగర్ లో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక ఇండస్ట్రియల్ ఏరియాలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ కంపెనీలో జరిగిన బ్లాస్ట్ కారణంగా మంటలు చెలరేగ్గాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి.

కంపెనీలోని ఫర్నేస్ సెక్షన్‌లో కంప్రెసర్ గ్లాస్ పేలడం వల్లే మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతి చెందినవారిని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే పనిలో ఉన్నారు.

కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సిబ్బందిని అడిగి వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఎంక్వైరీ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More
Next Story