తెలంగాణ లో ఎన్నికల సిబ్బంది భోజన మెనూ
x

తెలంగాణ లో ఎన్నికల సిబ్బంది భోజన మెనూ

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి బ్యాలెన్స్డ్ డైట్ అందించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.


తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి బ్యాలెన్స్డ్ డైట్ అందించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మే 13 న (రేపు) జరగనున్న ఎన్నికల నేపధ్యంలో ఒక రోజు ముందుగానే పోలింగ్ కేంద్రాలకు చేరుకునే ఎన్నికల సిబ్బందికి తగిన ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సిబ్బందికి టామాటా పప్పు, కోడిగుడ్డు కూర భోజనంలో అందజేయనున్నారు.

తెలంగాణాలో ఈ నెల 12న ఆదివారం ఎన్నికల సామాగ్రితో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బందికి సాయంత్రం 4 గంటలకు సమోసా, మజ్జిగ.. 5 గంటలకు మజ్జిగ లేదా నిమ్మరసం ఇచ్చారు. రాత్రి 7 నుంచి 8 గంటల మధ్యలో భోజనం (అన్నం, కూర, చపాతీ, టమాటా పప్పు, పెరుగు, చట్నీ) అందించారు.

పోలింగ్ రోజు 13న ఉదయం 6 గంటలకు టీ, రెండు అరటి పండ్లు, 8 నుంచి 9 గంటల మధ్య క్యారెట్, టమాటాతో కూడిన ఉప్మా పల్లీల చట్నీ, 11, 12 గంటల సమయంలో మజ్జిగ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం (కోడిగుడ్డు కూర, ఓ కూరగాయ, చట్నీ, సాంబారు, పెరుగు) అందించనున్నారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల సమయంలో మజ్జిగ లేదా నిమ్మరసం అందించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు టీ, బిస్కెట్లు ఇస్తారు. ఈ ప్రక్రియ గ్రామాల్లో పంచాయతీ అధికారులు, పురపాలికల్లో ప్రత్యేకంగా నియామకమైన వారు పర్యవేక్షించేలా కార్యాచరణ రూపొందించారు.

Read More
Next Story