
ముచ్చటగా మూడోసారి సిట్ విచారణకు ప్రణీత్ రావు
ప్రభాకర్ రావు ఆదేశం మేరకు ఫోన్ ట్యాపింగ్ …
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోA1 నిందితుడైన ఎస్బిఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నిన్న సిట్ విచారణకు హాజరైన నేపథ్యంలో శనివారం మాజీ డి ఎస్పీ ప్రణీత్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. ఒకే రోజు 650 ఫోన్లను ప్రణీత్ రావు ట్యాంపిగ్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఉదయమే సిట్ కార్యాలయానికి చేరుకున్న ప్రణీత్ రావును అధికారులు ప్రశ్నిస్తున్నారు. 2023 నవంబర్ 15న లో ప్రణీత్ రావు ఫోన్లు ట్యాప్ చేశారు. మాజీ డిజిపి ఆదేశం మేరకే తాను ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ప్రభాకర్ రావు అంగీకరించారు.
ప్రణీత్ రావు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది అనేది తేలాల్సి ఉంది. బ్యాంకు లావాదేవీల గూర్చి డాక్యుమెంట్ ఇవ్వాలని సిట్ అధికారులు ప్రణీత్ రావును కోరారు. ఈ డాక్యుమెంట్స్ ను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ నెల 13, 18 తేదీల్లో సిట్ విచారణకు హాజరైన ప్రణీత్ రావు ముచ్చటగా మూడోసారి విచారణకు హాజరయ్యారు. ప్రభాకర్ ఆదేశాల ప్రకారమే తాను ఫోన్ ట్యాప్ చేసినట్టు సిట్ అధికారుల ఎదుట అంగీకరించారు. ప్రభాకర్ రావు ఆదేశాల ప్రకారమే తాను ఫోన్ ట్యాప్ చేసినట్టు చెబుతుంటే ప్రభాకర్ రావు మాత్రం మాజీ డీజీపీ ఆదేశం ప్రకారం ఫోన్ ట్యాప్ చేసినట్టు చెబుతున్నారు. ఈ ఇద్దరు అధికారులు కేసీఆర్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాప్ చేసినప్పటికీ బిఆర్ఎస్ నేతల పేర్లుగానీ, మాజీ ముఖ్యమంత్రి పేరు గానీ వెల్లడించకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి ఆదేశం లేనిదే ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం లేదు అని కాంగ్రెస్ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి.