
మిస్ వరల్డ్ గా ఎంపికైన సుచాత
క్యాన్సర్ ముప్పు నుంచి మిస్ వరల్డ్ కిరీటం దాకా... సుచాతా విజయగాథ
72వ మిస్ వరల్డ్ థాయిలాండ్ అందాలభామ ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడి మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది.
థాయిలాండ్ దేశంలోని పుకెట్ నగరంలో జన్మించిన ఓపల్ సుచాత చువాంగ్ శ్రీకు మిస్ వరల్డ్ -2025 కిరీటం వరించడంతో ఆ దేశంలో శనివారం రాత్రి ఆమె అభిమానులు సంబరాలు చేసుకున్నారు. మిస్ వరల్డ్ గా ఎంపికైన సుచాతకు రూ.8.5 కోట్ల నగదు బహుమతిని అందించనున్నారు. పదహారేళ్ల వయసులో సచాతకు క్యాన్సర్ వచ్చింది.
ఈ క్యాన్సర్ మహమ్మారిి నుంచి బయటపడిన థాయిలాండ్ దేశంలో క్యాన్సర్ పై మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. క్యాన్సర్ బాధితులకు అండగా నిలబడేందుకు పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. క్యాన్సర్ బాధితులకు తాను అండగా నిలుస్తానని మిస్ వరల్డ్ సుచాత చెప్పారు.
Miss Thailand Opal Suchata crowned 72nd Miss World pic.twitter.com/2ykRIR1YZk
— Jacob Ross (@JacobBhoompag) May 31, 2025
హైదరాబాద్ లో ముగిసిన అందాల పోటీలు
హైదరాబాద్ వేదికగా తెలంగాణ పర్యాటక ప్రమోషన్ , సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించడమే లక్ష్యంగా నిర్వహించిన మిస్ వరల్డ్ 2025 పోటీలు విజయవంతం కావటంపై పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మిస్ వరల్డ్ వేడుకలను తెలంగాణలో ఘనంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. మిస్ వరల్డ్ ఈవెంట్ను అపూర్వ విజయంగా నిలిపిన ప్రతి ఒక్కరికీ మంత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.అందరి సహకారంతో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చెప్పగలిగామని మంత్రి పేర్కొన్నారు. సాంస్కృతిక వినిమయాన్ని ప్రోత్సహించే, తెలంగాణను ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా నిలిపే అంతర్జాతీయ కార్యక్రమాలను నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్రం సదా సమాయత్తంగా ఉంటుందని మంత్రి పునరుద్ఘాటించారు. ఇదే అంకిత భావంతో తెలంగాణ పర్యాటకాన్ని మరింత ప్రమోట్ చేసేందుకు కృషి చేస్తామన్నారు.
Next Story