తెలంగాణ ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్
x

తెలంగాణ ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్

బోనాలు వరాలు


తెలంగాణ పండుగ బోనాలును పురస్కరించుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు వరాలను ప్రకటించింది. పెండింగ్ మెడికల్ బకాయిలు 180. 30 కోట్లు క్లియర్ చేసినట్టు డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. దీంతో 26, 519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట లభించనుంది.

కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ముందు ఇచ్చిన సిక్స్ గ్యారెంటీ పథకాలు ఆర్థికభారమైనప్పటికీ అమలు చేస్తున్నామన్నారు .కెసీఆర్ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందని అయినప్పటికీ ప్రజల సంక్షేమం, అభివృద్దికి పెద్ద పీట వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

బోనాలు వేడుకలు ప్రారవభమైన రోజే తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పడంతో ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వెలిబుచ్చారు.

గత బిఆర్ ఎస్ ప్రభుత్వం బోనాలును రాష్ట్ర పండుగగా ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దిగజారినప్పటికీ బోనాలు వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై కోట్లు రిలీజ్ చేసింది. తెలంగాణ ఉద్యోగులకు , పెన్షనర్లకు వరాలు ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది.


Read More
Next Story