మంచు విష్ణుకు జీఎస్టీ అధికారుల షాక్
x
Manchu Vishnu

మంచు విష్ణుకు జీఎస్టీ అధికారుల షాక్

విష్ణు ఆఫీసుతో పాటు యూనిట్లో పనిచేస్తున్న మరికొందరు ఆఫీసులు, ఇళ్ళపైన జీఎస్టీ అధికారులు దాడులు చేయటం సంచలనంగా మారింది


కన్నప్ప సినిమా రిలీజ్ బిజీలో ఉన్న మంచు విష్ణుకు జీఎస్టీ అధికారులు పెద్ద షాక్ ఇచ్చారు. ఈనెల 27వ తేదీన కన్నప్ప సినిమా(Kannappa Movie)ను రిలీజ్ చేయించుకునే బిజీలో విష్ణు(Manchu Vishnu) ఉన్నాడు. ఈ సమయంలో బుధవారం రాత్రి సడెన్ గా విష్ణు ఆఫీసుతో పాటు యూనిట్లో పనిచేస్తున్న మరికొందరు ఆఫీసులు, ఇళ్ళపైన జీఎస్టీ అధికారులు దాడులు చేయటం సంచలనంగా మారింది. జీఎస్టీ దాడులగురించి విష్ణును మీడియా అడిగినపుడు సినిమా రిలీజ్ బిజీలో ఉన్నానని, తనకు దాడులగురించి తెలియదని సమాధానమిచ్చాడు. జీఎస్టీ అధికారులు దాడులు ఎందుకు చేశారు, దాడుల్లో ఏమి దొరికిందన్న విషయాలు తెలియాల్సుంది.

Read More
Next Story